
పసుపు పంటతో ఆదాయం
పసుపు ఇంటి పంట. జిల్లాలో ప్రతీ రైతు కనీసం ఎకరం నుంచి నాలుగెకరాల వరకు సాగు చేస్తారు. నేను 3 ఎకరాల్లో సాగు చేశా. ప్రస్తుతం రైతుల వద్ద లేనప్పుడు క్వింటాల్ ధర రూ.16 వేలకు చేరింది. పసుపు బోర్డు ఏర్పాటైనందున, ఈ ఏడాదైనా ధర వస్తుందనే ఆశతో పంట సాగు చేస్తున్నాం.
– సత్యంరెడ్డి, ముత్యంపేట, మల్లాపూర్
ఇక్కడి భూములు అనుకూలం
పసుపు పంటకు జిల్లాలోని ఎర్రనేలలు అనుకూలం. సాగులోనే కాకుండా దిగుబడి తీయడంలోనూ జిల్లా రైతులదే పైచేయి. ఇటీవల పంట వేసేందుకు, తవ్వేందుకు యంత్రాలు, సాగు నీరు, ఎరువుల కోసం డ్రిప్ ఉపయోగిస్తున్నారు. పెరుగుతున్న ధరలు మళ్లీ ఆశలు రేకెత్తిస్తున్నాయి.
– శ్యాంప్రసాద్, జిల్లా ఉద్యానశాఖ అధికారి, జగిత్యాల

పసుపు పంటతో ఆదాయం