
ఠాణాలో వీఆర్ఏ ఆత్మహత్యాయత్నం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి పోలీస్స్టేషన్లో ఓ వీఆర్ఏ పురుగుల మందు తాగడం కలకలం రేపింది. ఎస్సై రామ్మోహన్ తెలిపిన వివరాలు.. మండలంలోని చీర్లవంచకు చెందిన వేల్పుల సత్తవ్వ భర్త బలరాం 15 ఏళ్ల క్రితం తన తమ్ముళ్లు వేల్పుల కృష్ణ, వేల్పుల బాలకిషన్తో కలిసి సర్వేనంబర్ 586లో 7 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అందులో రో డ్డుకు 1.10 ఎకరాలు పోగా మిగతా భూమిని సమానంగా పంచుకున్నారు. ఐదేళ్ల క్రితం బలరాం మరణించగా వీఆర్ఏగా పనిచేస్తున్న అతడి తమ్ముడు వేల్పుల కృష్ణ మొత్తం భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. తనకు అనుకూలంగా హద్దురాళ్లను మార్చుకున్నాడు. 20 రోజుల క్రితం సత్తవ్వను ఆమె భూమిలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతోపాటు చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో సత్తవ్వ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కృష్ణపై కేసు నమోదైంది. కాగా ఆదివారం మధ్యాహ్నం 12.35 గంటలకు కృష్ణ పురుగులమందుతో పోలీస్స్టేషన్కు వచ్చాడు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నుంచి బయటపడాలనే ఉద్దేశంతో పురుగులమందు తాగాడు. వెంటనే అతడిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పింది. కాగా ఈ ఘటనపై ఎస్సై రామ్మోహన్ను వివరణ కోరగా, చట్టప్రకారమే కేసు నమోదు చేశామన్నారు. వేధింపులకు పాల్పడ్డామనడం అవాస్తవమని స్పష్టం చేశారు.
న్యాయం చేయండి : వీఆర్ఏ బాధితులు
వీఆర్ఏ కృష్ణ నుంచి తమ భూమిని ఇప్పించాలని బాధితులైన అతడి బంధువులు వేల్పుల సత్తవ్వ, అ నిల్కుమార్, రవీందర్ కోరారు. ఆదివారం మీడి యా ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. కృష్ణ రె వెన్యూశాఖలో పనిచేస్తుండగా తన పలుకుబడిని ఉ పయోగించి సర్వే నంబర్ 586లో రెండు గుంటల భూమికిగాను రెండెకరాల భూమి మ్యుటేషన్ చే యించుకున్నాడని ఆరోపించారు. గతంలో రవీందర్పై హత్యాయత్నానికి పాల్పడగా కేసు నమోదై, ఏ డేళ్ల జైలుశిక్ష కూడా పడిందన్నారు. కానీ, అప్పీల్కు వెళ్లి బెయిల్పై బయట తిరుగుతున్నాడని తెలిపా రు. కలెక్టర్, ఎస్పీ స్పందించి విచారణ చేపట్టి తమ కు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు.

ఠాణాలో వీఆర్ఏ ఆత్మహత్యాయత్నం