ఎస్‌యూలో అలరించిన క్రీడా వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఎస్‌యూలో అలరించిన క్రీడా వార్షికోత్సవం

Jun 23 2025 6:10 AM | Updated on Jun 23 2025 6:12 AM

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో వార్షిక క్రీడా దినోత్సవం ఆదివారం ఉత్సాహంగా జరిగింది. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్‌ ఉమేశ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు ఆటల్లోనూ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామన్నారు. వందేమాతరం శ్రీనివాస్‌, మధుప్రియలు హాజరై విద్యార్థులను ఆటపాటల్లో ఆనందపరిచారు. విద్యార్థులు హుషారుగా నృత్యాలు చేసి వేదికను హోరెత్తించారు. విశిష్ట అతిథి ఐఐసీటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. పీజీ తర్వాత ఉద్యోగాన్ని సాధించే విధంగా లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలని ఆకాంక్షించారు. ప్రత్యేక అతిధి కిరణ్‌ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ విద్యార్థులకు చదువుతోపాటు ఆటపాటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. అనంతరం వివిధ క్రీడల్లో విజేతలకు బహుమతులు అందించారు.

ఎస్‌యూలో అలరించిన క్రీడా వార్షికోత్సవం1
1/1

ఎస్‌యూలో అలరించిన క్రీడా వార్షికోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement