ఇల్లంతకుంట(మానకొండూర్): పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు బీ టీఆర్ ఫౌండేషన్ బాధ్యులు. ఇ ల్లంతకుంట మండలం నర్సక్కపేట గ్రామానికి చెందిన బెంద్రం తిరుపతిరెడ్డి 2020లో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశారు. సంస్థ పేరిట ఇప్పటి వరకు ఎవరి నుంచి విరాళాలు సేకరించలేదని, తన సొంత పొల ం 7 ఎకరాలు అమ్మి పేదలకు సాయం చేస్తున్నట్టు తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. కరోనా సమయంలో 505 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.2 వేల చొప్పున 12 రకాల ఆహార వస్తువులు అందించారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు (దాదా పు 965) 50 కిలోల చొప్పున బియ్యం అందజేశారు. 520 మంది ఆడపిల్లల వివాహానికి రెండు టే కు మంచాల చొప్పున అందజేశారు. ఐదేళ్ల నుంచి వి నాయక మండపాలకు ధూప దీప నైవేద్య ఖర్చులకు గాను మండలంలోని ప్రతి మండపానికి రూ. 5వేలు అందజేస్తున్నారు. 2010 నుంచి వేసవిలో ఇల్లంతకుంట బస్టాండ్ ఆవరణలో చలివేంద్రం ఏ ర్పాటు చేసి ప్రయాణికుల దప్పిక తీరుస్తున్నారు. అ ంతేకాకుండా మండలంలోని విద్యార్థులకు బస్సు పాసులు అందించడంలో సాయం చేస్తుంటారు. ఇ లా మండలంలోని పేదలకు తిరుపతిరెడ్డి సహాయ సహకారాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
బీటీఆర్ ఫౌండేషన్తో పేదలకు సాయం