ఇస్కాన్‌ ఆలయ నిర్మాణానికి సహకరిస్తాం | - | Sakshi
Sakshi News home page

ఇస్కాన్‌ ఆలయ నిర్మాణానికి సహకరిస్తాం

Jun 23 2025 5:52 AM | Updated on Jun 23 2025 5:52 AM

ఇస్కా

ఇస్కాన్‌ ఆలయ నిర్మాణానికి సహకరిస్తాం

కరీంనగర్‌కల్చరల్‌:కరీంనగర్‌లో ఇస్కాన్‌ మందిర నిర్మాణానికి ప్రభుత్వపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ సహకరిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమా ర్‌ పేర్కొన్నారు. జూలై 5న నిర్వహించే జగన్నాథ రథయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. కరీంనగర్‌ ఇస్కాన్‌శాఖ పక్షాన జరుగుతున్న 4వ రథయాత్రను విజయవంతం చేయాలని సూచించారు. కరీంనగర్‌ పురవీధుల్లో 4వ జగన్నాథ రథయాత్ర శోభాయమానంగా సాగాల ని రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నా రు. జగన్నాథ రథయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. తాను కూడా తప్పకుండా రథయాత్రలో పాల్గొంటానని తెలిపారు. ఇస్కాన్‌ కరీంనగర్‌శాఖ నిర్వాహకులు ప్రభు నరహరిదాస్‌, కన్నకృష్ణ, ఎల్‌ రాజభాస్కర్‌రెడ్డి, తుమ్మల రమేశ్‌రెడ్డి, కెప్టెన్‌ బుర్ర మధుసూదన్‌రెడ్డి, కొమురవెల్లి వెంకటేశం, పోరెడ్డి శ్రీహరిరెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి

కరీంనగర్‌: నగరపాలక సంస్థలో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించి, పారదర్శకంగా డివిజన్ల ఏర్పాటు ప్రక్రియను కొనసాగించాలని మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ పేర్కొన్నారు. ఆదివారం నగరంలో మాట్లాడుతూ కార్పొరేషన్‌లో 5వేల ఓట్లు కలిగిన డి విజన్లకు మాత్రమే రూపకల్ప చేయాలని జీవో269ను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్‌, మజ్లిస్‌ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, డివిజన్ల ఏర్పాటు, ఓట్లు మార్పులు, చేర్పులకు ఎంపీ ఓవైసీ, మంత్రి పొన్నం ప్రభాకర్‌ మధ్య ఈనెల 16న హైదరాబాద్‌లో చర్చలు జరిగా యని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయకముందే ఇలాంటి చర్చలు జరిపి జీవో 12ను ఉల్లంఘించే అవకాశం ఉందన్నా రు. కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ పారదర్శకంగా డివిజన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు గుంజపడుగు హరిప్రసాద్‌, పెండ్యాల మహేశ్‌కుమార్‌, కెంసారం తిరుపతి, తుల భాస్కర్‌రావు పాల్గొన్నారు.

‘మీ అభ్యంతరాలు ఆమోదించాం’

బల్దియా వ్యక్తిగత లేఖలు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారికి నగర పాలకసంస్థ సమాధానాలు పంపిస్తోంది. వ్యక్తిగతంగా వారు తెలిపిన అభ్యంతరా లు, పరిష్కరించడాన్ని తెలియజేస్తూ లేఖలు అందిస్తోంది. నగరంలోని 66 డివిజన్ల పునర్విభజన సందర్భంగా జారీ చేసిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌పై ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించడం తెలి సిందే. పది డివిజన్లు మినహా 56 డివిజన్ల నుంచి 242 అభ్యంతరాలు వచ్చాయి. ఈ అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిజమైనవని తేలితే వాటిని పరిష్కరించారు. మిగతా వాటిని తిరస్కరించారు. 16వ తేదీతో అభ్యంతరాల పరిశీలన ముగియగా, తుది జాబితాను 20వ తేదీ ప్రభుత్వానికి పంపించడం తెలిసిందే. ఆ తరువాత అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారికి సమాధానాలు పంపించే ప్రక్రియను నగరపాలకసంస్థ అధికారులు చేపట్టారు. డివిజన్‌ల హద్దులు, ఇంటి నంబర్లపై వ్యక్తంచేసిన అభ్యంతరాలను ఆమోదిస్తే, ‘మీ అభ్యంతరాలు ఆమోదించామని’, తిరస్కరిస్తే అందుకు కారణాలను తెలియచేస్తూ సమాధానాన్ని లేఖ రూపంలో వ్యక్తిగతంగా అందజేస్తున్నారు.

ఉపాధ్యాయులకు పర్యవేక్షణ సరికాదు

కరీంనగర్‌: ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం సరికాదని డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అవాల నరహరి, చకినాల రాంమోహన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌లను పర్యవేక్షణ అధికారులుగా బాధ్యతలు అప్పగించడం సరికాదని, ఇది విద్యారంగ తి రోగమన చర్య అన్నారు. ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో విద్యాప్రమాణాలకు చర్యలు తీసుకుంటామని చెబుతూనే ఇలాంటి చర్యలకు పాల్పడడం అనాలోచితమన్నారు.

ఇస్కాన్‌ ఆలయ  నిర్మాణానికి సహకరిస్తాం1
1/1

ఇస్కాన్‌ ఆలయ నిర్మాణానికి సహకరిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement