
దోమల నివారణ అందరి బాధ్యత
కరీంనగర్టౌన్: దోమల నివారణ అందరి బాధ్యత అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఉమాశ్రీ ఆధ్వర్యంలో శనివారం విద్యానగర్ పట్టణ ఆరోగ్యకేంద్రం పరిధిలోని తెలంగాణ బధిరుల పాఠశాలలో దోమల మందు స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో దోమలు వృద్ధి చెందకుండా దోమ లార్వా నిర్మూలనకు తీసుకోవలసిన చర్యల గురించి, ప్రతి శుక్రవారం, మంగళవారం డ్రైడే పాటించడం గురించి సిబ్బందికి అవగాహన కల్పించారు. విద్యానగర్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఎన్సీడీ రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సుమన్ పాల్గొన్నారు.