
అప్పులబాధతో నేతకార్మికుడి ఆత్మహత్య
సిరిసిల్లక్రైం: ప్రమాదంలో కాలువిరగడంతో పని చేయలేక.. అప్పులు తీర్చే మార్గం కనిపించక సిరిసిల్లలో నేతకార్మికుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్కు చెందిన నేతకార్మికుడు వలస రమేశ్(48) పవర్లూమ్స్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండేళ్ల క్రితం రమేశ్ కాలుకు దెబ్బతగిలి పనికి దురయ్యాడు. సరైన ఉపాధి లేక.. కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు రూ.5లక్షలు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో స్థానిక కార్గిల్లేక్లో శనివారం దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య లావణ్య, కుమారులు సాయిచరణ్, సచిన్ ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.