దుమాల గురుకులం ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

దుమాల గురుకులం ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌

Jun 20 2025 6:26 AM | Updated on Jun 20 2025 6:26 AM

దుమాల గురుకులం ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌

దుమాల గురుకులం ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌

● మరిమడ్ల ప్రిన్సిపాల్‌కు బాధ్యతలు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య గిరిజన గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్‌ మంజిత్‌ను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం తాత్కాళికంగా కోనరావుపేట మండలం మరిమడ్ల గురుకులం ప్రిన్సిపాల్‌ రాము సూరత్‌యాదవ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. విధులపై నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల ఆర్డర్ల అమలులో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడంతోనే వేటు పడింది. పాఠశాలలో పనిచేస్తున్న నలుగురు జౌట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను మూడు రోజుల క్రితం విధుల నుంచి తొలగించడం.. గురుకులాల ఉన్నతాధికారులు ఇచ్చిన ఆర్డర్‌ను పట్టించుకోకుండా వ్యవహరించడాన్ని సీరియస్‌గా పరిగణిస్తూ సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను

విధుల్లోకి తీసుకోవాలి

గత 20 ఏళ్లుగా గురుకులంలో పనిచేస్తున్న నలుగురు జౌట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు భూక్య గజన్‌లాల్‌ డిమాండ్‌ చేశారు. నాయకులు మాలోత్‌ కిరణ్‌నాయక్‌, గుగులోత్‌ రవినాయక్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement