విశిష్టత తెలిపేలా యోగా దినోత్సవం నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

విశిష్టత తెలిపేలా యోగా దినోత్సవం నిర్వహణ

Jun 20 2025 6:26 AM | Updated on Jun 20 2025 6:26 AM

విశిష్టత తెలిపేలా యోగా దినోత్సవం నిర్వహణ

విశిష్టత తెలిపేలా యోగా దినోత్సవం నిర్వహణ

కరీంనగర్‌కల్చరల్‌: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని వికాస తరంగిణి, ప్రజ్ఞావికాస్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌ మహాత్మ జ్యోతిరావు పూలే సర్కస్‌ గ్రౌండ్‌లో శనివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు త్రిదండి రామానుజ జీయర్‌ స్వామివారి మంగళశాసనా లతో దేవనాథ రామానుజీయర్‌ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో యోగా విశిష్టత తెలిపేలా యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రజ్ఞావికాస్‌ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌ రావు, వికాస తరంగిణి జోనల్‌ అధ్యక్షుడు గౌతంరావు తెలిపారు. గురువా రం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతీరోజు విద్యార్థులకు యోగా నేర్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులకు విలువలతో కూడిన విద్య,కుటుంబ విలువలు, కుటుంబ ప్రాముఖ్యత అర్థమయ్యే విధంగా తెలియజేస్తామన్నారు. సమావేశంలో వికాస తరంగణి, ప్రజ్ఞా వికాస్‌ ఆధ్వర్యంలో యాద కిషన్‌, సిరికొండ వెంకటేశం, రవీందర్‌ రావు, ప్రభాకర్‌ రావు, కర్ణాకర్‌రావు, జగన్నాథరావు, ప్రతాప్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement