
మృత్యుముంగిట మూడేళ్ల బాబు
సిరిసిల్ల: మూడేళ్ల బాబు మృత్యువుతో పోరాడుతున్నాడు. వైద్యం చేయిస్తే బతికేందుకు అవకాశం ఉంది. సిరిసిల్ల పట్టణం బీవైనగర్కు చెందిన గూడూరి శేఖర్–సంజన దంపతుల మూడేళ్ల కొడుకు మనీశ్ అనారోగ్యంతో బాధపడుతుండడంతో స్థానిక ఆస్పత్రిలో చూపించారు. జాండీస్ వల్ల లివర్ పూర్తిగా చెడిపోయిందని, ఆరోగ్య పరిస్థితి విషమించిందని డాక్టర్లు నిర్ధారించారు. హైదరాబాదులోని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. మనీశ్కు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స అవసరమని, ఆపరేషన్కు రూ.25 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. బాలుడి తల్లి బీడీ కార్మికురాలు, తండ్రి ప్రైవేటు వర్కర్ కావడంతో అంత పెద్ద మొత్తంలో వైద్య ఖర్చులు భరించలేని ఆ తల్లిదండ్రులు నిస్సహాయ స్థితిలో దిక్కులు చూస్తున్నారు. ఇప్పటికే అప్పులు చేసి రూ.4 లక్షల వరకు ఆస్పత్రిలో చెల్లించారు. ఇంకా రూ.21 లక్షలు ఆపరేషన్కు అవసరం ఉంది. ప్రభుత్వ అధికారులు, నాయకులు, స్వచ్చంధ సంస్థలు, దాతలు స్పందిస్తేనే ఆ పసిహృదయం ఊపిరి నిలుస్తుంది. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు స్పందించి మనీశ్ వైద్యానికి ఆర్థికసాయం అందించాలని ఆ పేద తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
ఆర్థికసాయం చేయాలనుకునేవారు
మనీశ్ తండ్రి శేఖర్ను
94411 61257
ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు.
లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు రూ.25 లక్షలు అవసరం
చేతిలో డబ్బు లేక నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రులు
దాతల సాయం కోసం వేడుకోలు