
కుంటయ్యకు కన్నీటి వీడ్కోలు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా జనరల్ ఆస్పత్రి బుధవారం ఉదయం జనసంద్రమైంది. తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కరికవేని కుంటయ్య(48) ఆత్మహత్య ఉదంతం నేపథ్యంలో జిల్లాలోని బీఆర్ఎస్ శ్రేణులు సిరిసిల్లకు తరలివచ్చాయి. కుంటయ్య మృతదేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదా ర్చారు. అన్ని విధాలా పార్టీ ఆదుకుంటుందని భరో సా ఇచ్చారు. కుంటయ్య ఆత్మహత్యకు కారణమైన వారికి ఎవ్వరనీ వదిలిపెట్టమని, న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. క్రమశిక్షణ కలిగిన గులా బీ నాయకుడిని కోల్పోయామని, హైదరాబాద్ వర కు నాకు అండగా వచ్చిన కుంటయ్య ఇలా ఆత్మహత్యకు పాల్పడడం ఎంతో బాధ వేసిందని బరువెక్కి న గుండెలతో కేటీఆర్ మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, చొప్పదండి మాజీ ఎ మ్మెల్యే సుంకె రవిశంకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, నా యకులు ఏనుగు మనోహర్రెడ్డి, న్యా లకొండ రాఘవరెడ్డి, మాట్ల మధు, కోడి అంతయ్య తదితర నాయకులతో ఆస్పత్రి ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
పోలీసు బందోబస్తు
సిరిసిల్ల ఆస్పత్రి వద్ద పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. శవపంచనామా పూర్తి చేసినా కేటీఆర్ వ చ్చేంత వరకు పోస్టుమార్టం చేయలేదు. బీఆర్ఎస్ శ్రేణులతో ఆస్పత్రి నిండిపోవడంతో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. టౌన్ సీఐ కృష్ణ, రూరల్ సీఐ మొగిలి, ఎస్బీ సీఐ రవికుమార్, ఇ ంటలిజెన్స్ సీఐ వెంకటేశ్, ఎస్సైలు రామ్మోహన్, శ్రీ నివాస్రావు, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.