
రైతు ఆలోచన అదిరింది
ధర్మపురి: ఎడ్ల నాగలితో వ్యవసాయం దూరమైంది. ఆధునిక యంత్రాలు, ట్రాక్టర్లు వచ్చాయి. అయితే పంటల్లో కలుపుతీసేందుకు కొన్ని యంత్రాలు వచ్చినా.. వాటి ధర సామాన్య రైతులకు అందకుండా ఉంది. కూలీలతో కలుపు తీయిస్తే ఖర్చు మోపెడవుతోంది. ఈ క్రమంలో ఖర్చును ఆదా చేసుకునేందుకు ఓ రైతు సైకిల్ ద్వారా కలుపు తీస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ధర్మపురి మండలం బుద్దేశ్పల్లెకు చెందిన మహ్మద్ సలీంకు రెండెకరాల భూమి ఉంది. అందులో వివిధ రకాల కూరగాయలు పండిస్తుంటాడు. ట్రాక్టర్, ఎడ్లనాగళ్లతో సాగు చేయగా.. ఎకరాన రూ. పదివేలు ఖర్చు రావడంతో పాత సైకిల్కు వెనుక చక్రం తీసి.. దాని స్థానంలో కలుపు మొక్కలు తొలగిపోయేలా పట్టి అమర్చాడు. హ్యాండిల్ ద్వారా సైకిల్ను నెట్టుకుంటూ వెళ్తుంటే కలుపు మొక్కలు తొలగిపోతున్నాయి. నాగలి వంటి మరో పరికరాన్ని బిగించి విత్తనాలు వేసేందుకు సాళ్లు కూడా పడుతున్నాడు. ఈ విధానం ద్వారా పని తొందరగా అవ్వడమే కాకుండా.. ఖర్చు కూడా ఆదా అవుతోందని అంటున్నాడు రైతు మహ్మద్ సలీం.
వ్యవసాయంలో ఆదా కోసం సైకిల్తో వ్యవసాయం
ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న సలీం

రైతు ఆలోచన అదిరింది