
విద్యుదాఘాతానికి గురైన ట్రాన్స్కో తాత్కాలిక ఉద్యోగి
ఇబ్రహీంపట్నం: బర్థీపూర్ గ్రామంలో ట్రాన్స్కోలో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగి సాంబరి హరీశ్ ఈనెల 12న విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్తంభంపై నుంచి పడి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. బర్థీపూర్ గ్రామంలో విద్యుత్ అంతరాయం కలగగా.. లైన్మెన్ రాజు సెలవులో ఉండడంతో మరమ్మతు చేసేందుకు లైన్ ఇన్స్పెక్టర్ ఫ్రాంక్లిన్ తాత్కాలిక ఉద్యోగులు హరీశ్, శ్రీకాంత్లను తీసుకెళ్లారు. స్తంభంపైకి ఎక్కి చూడాలని లైన్ ఇన్స్స్పెక్టర్ సూచించగా.. హరీశ్ పైకి ఎక్కి మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతంతో కింద పడిపోయాడు. ఏఈ సతీశ్ వచ్చి పరిశీలించి హరీశ్ను మెట్పల్లి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని రేనె ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నాడు. హరీశ్ కుటుంబం పేద కుటుంబం కావడంతో వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత లేదు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి సాయమందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
85008 56881
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
దాతల సాయం కోసం ఎదురుచూపులు

విద్యుదాఘాతానికి గురైన ట్రాన్స్కో తాత్కాలిక ఉద్యోగి

విద్యుదాఘాతానికి గురైన ట్రాన్స్కో తాత్కాలిక ఉద్యోగి