
గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
తిమ్మాపూర్(మానకొండూర్): ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు యువకులను ఎల్ఎండీ పోలీసులు అరెస్టు చేశారు. తిమ్మాపూర్ సీఐ సదన్కుమార్, ఎస్సై శ్రీకాంత్గౌడ్ తెలిపిన వివరాలు..
పక్కా సమాచారంతో..
గంజాయి తరలిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో సోమవారం సాయంత్రం మండలంలోని కొత్తపల్లి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురు యువకులను ఆపి తనిఖీ చేయగా, వారి బ్యాగుల్లో 5 కిలోల గంజాయి లభించింది. అరెస్టయిన వారు వేములవాడ మండలం నాగయ్యపల్లికి చెందిన గుంటి నగేశ్, వేములవాడ పట్టణానికి చెందిన కుతాడి భరత్కుమార్, కోనరావుపేట మండలం మట్టిమల్ల గ్రామానికి చెందిన చెప్పాల సాత్విక్.
అమ్మకం కోసమే..
సదరు యువకులు కొంతకాలంగా గంజాయికి బానిసై, సులభంగా డబ్బు సంపాదించే ఉద్దేశంతో అమ్మకం చేస్తున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి, ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా పట్టుబడ్డారు. వారి నుంచి గంజాయితో పాటు బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.