
వయోవృద్ధులపై వేధింపులు బాధాకరం
కరీంనగర్: ప్రపంచ వయోవృద్ధులపై వేధింపుల నిరోధక దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేశ్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ వయోవృద్ధుల వసతి గృహంలో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ, రోజురోజుకు వయోవృద్ధులపై వేధింపులు పెరిగిపోతుండడం చాలా బాధాకరమన్నారు. మనం ఈ స్థితిలో ఉన్నామంటే మన పెద్దలు, వయోవృద్ధుల సలహాలు, మార్గనిర్దేశం వల్లే అని పేర్కొన్నారు. ఏ విధమైన న్యాయ సలహాల కోసం 15100 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్, వయోవృద్ధుల గృహ నిర్వాహకురాలు రాధిక పాల్గొన్నారు.
రైతు నేస్తం ప్రారంభం
కరీంనగర్ అర్బన్: జిల్లాలోని 30 రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలు, అదనపు కలెక్టర్, జి ల్లా వ్యవసాయ అధికారి పాల్గొన్నారు. మొత్తం 77 క్లస్టర్లకు గానూ 48 క్లస్టర్లలో రైతు నేస్తం అమలవనుంది. కాగా గన్నేరువరం మండలం మాదాపూర్ నుంచి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, డీఏవో భాగ్యలక్ష్మి హాజరవగా చొప్పదండి రైతు వేదిక నుంచి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ముగ్ధంపూర్ రైతు వేదిక నుంచి అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, ఆర్డీవో మహేశ్వర్, దుర్శేడ్ రైతు వేదిక నుంచి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కమాన్పూర్ రైతు వేదిక నుంచి మునిసిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, చామనపల్లి రైతు వేదిక నుంచి జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం హాజరయ్యారు.
మాస్టర్ప్లాన్పై అభ్యంతరాలుంటే చెప్పాలి
కరీంనగర్ కార్పొరేషన్: కొత్త మాస్టర్ ప్లాన్పై ఈ నెల 28లోగా అభ్యంతరాలు తెలియజేయాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం సుడా కార్యాలయంలో మాస్టర్ ప్లాన్, ఇతర అంశాలపై చర్చించారు. 30 ఏళ్ల తరువాత కొత్త మాస్టర్ ప్లాన్ను అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. అభ్యంతరాల గడువు ముగిసిన తరువాత ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని తెలిపారు. తర్వాత అభ్యంతరాలు వ్యక్తం చేసినా ప్రయోజనం ఉండదన్నారు. అలాగే సుడా నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు నా ణ్యతతో ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో సుడా వైస్చైర్మన్ ప్రఫుల్ దేశాయ్, సీపీవో ఆంజనేయులు, ఈఈ రొడ్డ యాదగిరి, డీఈ రాజేంద్రప్రసాద్, ఏఈ సతీశ్, ఇన్చార్జి డీసీబీ బషీర్, ఏసీపీలు వేణు, శ్రీధర్ పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖలో పదోన్నతులు
కరీంనగర్అర్బన్: వ్యవసాయ శాఖలో పదోన్నతుల జాతర మొదలైంది. జిల్లాలో నలుగురికి రాజన్న, లవకుమార్, హరికృష్ణ, కిరణ్లకు జూ నియర్ నుంచి సీనియర్ అసిస్టెంట్గా పదో న్నతి కల్పించగా వివిధ ప్రాంతాలకు బదిలీ చే శారు. రాజన్న సిద్దిపేటకు, హరికృష్ణ రామడు గు, లవకుమార్ను కరీంనగర్ డీఏవో ఆఫీస్, కిరణ్ను కామారెడ్డి డీఏవో ఆఫీస్కు బదిలీ చే శారు. త్వరలోనే ఏఈవోలు, ఏవోలు, ఏడీఏల కు పదోన్నతులు కల్పించే అవకాశాలు ఉన్నాయని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఏఈవో లుగా 15ఏళ్లు పనిచేస్తున్నవారుండగా ఏవోలు గా 20ఏళ్లు, ఏడీఏలుగా 10ఏళ్లుగా పనిచేస్తున్న అధికారులున్నారు. రెవెన్యూ శాఖలో మూడునాలుగేళ్లకే పదోన్నతులు లభిస్తుండగా వ్యవసా య శాఖలో మాత్రం దశాబ్దాలు దాటినా పదో న్నతులు లేవన్న అసహనం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఏఈవో, ఏవో, ఏడీఏలు వారి వారి సంఘాల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మంత్రులకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ మేరకు పదోన్నతులకు మార్గం సుగమమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వయోవృద్ధులపై వేధింపులు బాధాకరం

వయోవృద్ధులపై వేధింపులు బాధాకరం