
ఆవేదనల నివేదనలు
కరీంనగర్ అర్బన్: ‘ప్రజావాణి’ జన జాతరను మరిపించింది. ఓ వైపు రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నా.. భూ సమస్యలకు సంబంధించి అర్జీలు రావడం గమనార్హం. అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, మునిసిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మండలస్థాయిలో పరిష్కరించే అంశాలే కాగా అలవిమాలిన నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, తదితర అర్జీలను అందజేశారు. ప్రజావాణికి 307 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. ఈ సందర్భంగా పలువురిని ‘సాక్షి’ పలకరించగా వారి ఆవేదనను వివరించారు. వివరాలు వారి మాటల్లోనే..
ప్రజావాణికి 307 అర్జీలు
అత్యధికం భూ సమస్యలే
మొత్తం అర్జీలు: 307
ఇందులో ఎక్కువగా..
మునిసిపల్ కార్పొరేషన్: 65
కరీంనగర్ రూరల్ తహసీల్దార్: 17
ఆర్డీవో, కరీంనగర్: 12
తిమ్మాపూర్ తహసీల్దార్: 12
డీపీవో: 10
తహసీల్దార్ వీణవంక: 10
వారధి సొసైటీ: 09
ఎంపీడీవో జమ్మికుంట: 08