
సీలింగ్ భూమిని పట్టా చేశారు
తాహెర్కొండాపూర్ గ్రామంలో సీలింగ్ భూమిని 1993లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గ్రామసభ ద్వారా ప్రొసీడింగ్లు జారీ చేశారు. అప్పటి నుంచి కాస్తు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా రికార్డులో మా పేర్లు చేర్చలేదు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా దాటవేత ధోరణిని ప్రదర్శించారు. రికార్డులో ఉన్న పేర్ల ఆధారంగా వారి వారసులు వారి పేరున మార్చుకుని మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఇచ్చిన భూమిని తిరిగి ఎలా స్వాధీనం చేసుకుంటారు. సీలింగ్ భూమిని ప్రభుత్వం తీసుకున్నాక అధికారులు వారి పేరున ఎలా మార్చుతారు.?
– బాధితులు, చర్లబూత్కూర్
ఆదేశాలు అమలు చేయడం లేదు
నా పేరుపై ఉన్న ఇల్లు, భూమిని అక్రమంగా రికార్డులో నమోదు చేసుకున్నారని గత నెల 12న ప్రజావాణిలో కలెక్టర్ను కలిశాను. అప్పుడు ఎంపీడీవో పిలిచి విచారణ చేపట్టి రికార్డు మార్చాలని ఆదేశించారు. కానీ, ఇప్పటివరకు ఏలాంటి విచారణ లేదు. దొంగ కాగితాలతో పేర్లు మార్చుకుంటే చర్యలు తీసుకోవాల్సిందిపోయి నన్నిలా ఏళ్లుగా తిప్పుకుంటున్నారు.
– దుర్గం చంద్రయ్య కుటుంబం,
కేశవపట్నం

సీలింగ్ భూమిని పట్టా చేశారు