
కూతురును ఎస్సై చేసిన కూలీ తండ్రి
శంకరపట్నం(మానకొండూర్): శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన గొల్లపల్లి సమ్మయ్య–దేవేంద్ర దంపతులకు ఇద్దరు కూతుర్లు దివ్య, నవ్య. పెద్ద కూతురు దివ్యను చదువులో ముందుండడంతో సమ్మయ్య కూలీ పనులు చేస్తూ బాసరలో ఎంటెక్ చదివించాడు. తల్లితండ్రుల ప్రోత్సాహంతోనే ఎస్సై ఉద్యోగానికి ఎంపికై నట్లు వంగర పోలీస్స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్న దివ్య తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తండ్రి కూలీ చేసిన సంపాదనతోనే చదువుకుని ప్రిపేర్ అయ్యానని, తండ్రి పడిన కష్టానికి గుర్తింపుగా ఎస్సై ఉద్యోగం రావడం సంతోషంగా ఉందని దివ్య పేర్కొన్నారు.