బావిలో పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

బావిలో పడి వ్యక్తి మృతి

Jun 15 2025 7:23 AM | Updated on Jun 15 2025 7:23 AM

బావిలో పడి వ్యక్తి మృతి

బావిలో పడి వ్యక్తి మృతి

వెల్గటూర్‌: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన ఎండపల్లి మండలం పాతగూడూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గంధం నారాయణ (50) తాను కౌలుకు చేసే పొలంలో నారు, ఎండిపోతున్న పత్తి చేనుకు నీరుపెట్ట్టడానికి వెళ్లి కరెంట్‌ మోటార్‌ పెడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతిచెందాడు. మృతుడి భార్య వినోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు..

కరీంనగర్‌రూరల్‌: అసలే రాజీవ్‌ రహదారి... ఆపైన అర్ధరాత్రిలో అతివేగంగా కారును నడిపిస్తు ముందున్న వాహనాన్ని ఢీకొట్టిన ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్‌రూరల్‌ సీఐ నిరంజన్‌రెడ్డి కథనం మేరకు... మానకొండూరు మండలం లక్ష్మిపూర్‌ గ్రామానికి చెందిన సుంకె సందీప్‌(26) స్నేహితులు రాపాక సుభాశ్‌, అంతగిరి శేఖర్‌తో కలిసి శుక్రవారం కారులో పని నిమిత్తం సుల్తానాబాద్‌కు వెళ్లారు. రాత్రి 12గంటల సమయంలో తిరిగి కరీంనగర్‌కు కారులో వస్తున్న క్రమంలో రాజీవ్‌ రహదారిపై మొగ్ధుంపూర్‌ జెడ్పీ పాఠశాల వద్ద ముందున్న గుర్తుతెలియని వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో సందీప్‌ గొంతు తెగిపోగా, తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. సుభాశ్‌, శేఖర్‌ తీవ్రంగా గాయపడ్డారు. రూరల్‌పోలీసులు అక్కడికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన సందీప్‌మృతదేహాన్ని బయటకు తీశారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వాహనాన్ని తప్పించబోయి సింగరేణి యువ అధికారి..

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): యైటింక్లయిన్‌కాలనీ పోస్టాఫీసు ఏరియా వద్ద శ నివారం జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఉప్పటీ రమేశ్‌బాబు (37) ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. యైటింక్లయిన్‌కాలనీ ఎన్‌సీ– 107 క్వార్టర్‌లో నివాసం ఉంటూ ఆర్జీ–2ఏరియా ఓసీపీ–3లో అండర్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న రమేశ్‌బాబు.. బైక్‌పై కాలనీలో వ్యాపార సముదాయానికి వెళ్లారు. తన కుమార్తెకు బ్రెడ్‌ప్యాకెట్‌ కొనుగోలు చేసి మళ్లీ ఇంటికి బయలు దేరారు. ఈక్రమంలో పోస్టాఫీసు క్వార్టర్స్‌ మధ్య ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి కింద పడిపోయాడు. ఈ ఘటనలో తల పగిలి రక్తస్రావం జరిగి స్పృహ కోల్పోయాడు స్థానికులు 108 అంబులెన్స్‌లో గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. 2016లో సింగరేణిలో బాధ్యతలు స్వీకరించిన రమేశ్‌బాబు.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోడంతో అధికారులు ఆవేదన చెందారు. మృతుడి భార్య కిర్తీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు టూటౌన్‌ సీఐ ప్రసాద్‌రావు తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఆరెళ్ల కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement