
నీట్లో సత్తాచాటిన విద్యార్థులు
తల్లిదండ్రులతో తన్మయ
రాయికల్(జగిత్యాల): రాయికల్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు దాసరి రామస్వామి, కల్పన దంపతుల రెండో కూతురు తన్మయ నీట్లో ఆలిండియా 3,250వ ర్యాంక్ సాధించింది. ఇంటర్ బైపీసీలో 985 మార్కులు సాధించగా ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు నీట్కు సిద్ధం చేశారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 720 మార్కులకు 582 సాధించి జాతీయస్థాయి ర్యాంక్ సాధించింది. తన్మయ మాట్లాడుతూ, భవిష్యత్లో నిరుపేదలకు వైద్యసేవలందిస్తానని తెలిపారు.
డాక్టర్ కావడమే లక్ష్యం..
రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులైన ఎలిగేటి రాజ్కిశోర్, లావణ్య దంపతుల కూతురు ఎలిగేటి మధుమిత నీట్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 45,088వ ర్యాంక్, తెలంగాణ స్థాయిలో 344వ ర్యాంక్ సాధించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో డాక్టర్ కావడమే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాయని మధుమిత తెలిపారు. ఈ సందర్భంగా మధుమితను ఉపాధ్యాయ సంఘం నాయకులు అభినందించారు.
సింగరేణి కార్మికుడి బిడ్డకు 2,481వ ర్యాంకు
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): నీట్ ఫలితాల్లో రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడి బిడ్డ రిషికశర్మ 2,481వ ర్యాంకు సాధించింది. తల్లిదండ్రులు రాజేశ్కుమార్, బబితాకుమారి. తండ్రి కరోనా సమయంలో మృతిచెందాడు. అయినా రిషికశర్మ ధైర్యం కోల్పోకుండా తల్లి ప్రోత్సాహంతో నీట్లో 588 మార్కులు సాధించి ఉత్తమ ర్యాంకు కై వసం చేసుకుంది. భవిష్యత్తులో వైద్య రంగంలో ఉన్నత స్థాయిలో ఉండి సేవ చేయాలన్నదే తన లక్ష్యమని రిషికశర్మ పేర్కొంది.

నీట్లో సత్తాచాటిన విద్యార్థులు

నీట్లో సత్తాచాటిన విద్యార్థులు