
పెన్షన్ ఇప్పిస్తానని బంగారం చోరీ
గంగాధర(చొప్పదండి): పెన్షన్ ఇప్పిస్తా అంటూ ఓ వ్యక్తి వృద్ధురాలి మెడలో బంగారు గొలు సు, చెవి కమ్మలు, నగదు తీసుకొని ఉడాయించిన ఘటన మండలంలోని మధురానగర్ బస్టాండులో శనివారం జరిగింది. ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు.. వేములవా డ మండలం నమిలిగుండుపల్లి గ్రామానికి చెందిన గోలి వజ్రమ్మ మధురానగర్ బస్టాండులో బస్సు దిగి ఆస్పత్రిలో చూపించుకోవడానికి నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి పేరు పెట్టి పిలవడంతో పాటు పంచాయతీ కార్యదర్శినని, పెన్షన్ ఇప్పిస్తానని ఆమె మెడలోని తులం బంగారు గొలుసు, చెవికమ్మలు, రూ.వెయ్యి నగదు తీసుకొని ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
కొత్తపల్లి: పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని హైకోర్టు న్యాయవాది ఈవీ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాలకు శనివారం లేఖలు రాసినట్లు ఆయన తెలిపారు. ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారని, వారికి ఒక్కొక్కరికి రూ.5 కోట్ల నష్ట పరిహారంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
డీఎల్ఎడ్, డీపీఎస్ఈ కోర్సుల్లో ప్రవేశాలకు షెడ్యూల్
తిమ్మాపూర్: తెలంగాణలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థలు, ప్రైవేట్ డీఎల్ఎడ్ కళాశాలల్లో రెండేళ్ల డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ప్రీ– స్కూల్ ఎడ్యుకేషన్న్ కోర్సుల్లో 2025– 26 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన డీసెట్–2025లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల కోసం ఆన్లైన్ షెడ్యూల్ ప్రకటించింది. డీసెట్– 2025లో ఉత్తీర్ణులై, ఇప్పటివరకు ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఈనెల 14 నుంచి 17వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. సీట్ల కేటాయింపు జూన్ 20న జరుగుతుంది. సీటు కేటాయించబడిన అభ్యర్థులు 21నుంచి 24లోగా ఫీజు చెల్లించి, అలాట్మెంట్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోవాలి.

పెన్షన్ ఇప్పిస్తానని బంగారం చోరీ