
‘జ్యోతిష్మతి’ విద్యార్థులకు కార్పొరేట్ ఉద్యోగాలు
తిమ్మాపూర్: మండలకేంద్రంలోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైనన్స్ కళాశాల విద్యార్థులు ప్రపంచ ప్రఖ్యాత బహుళజాతి సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించినట్లు చైర్మన్ సాగర్ రావు తెలిపారు. ఈ విద్యార్థులు నైపుణ్య శిక్షణ, ఆధునిక విద్యా విధానాలు, కళాశాల సమగ్ర విధానం ద్వారా ఈ విజయాలను అందుకున్నారు. కళాశాల విద్యార్థులు ఎన్విడియా, టార్గెట్, ఇన్ఫోసిస్, క్యాప్ జెమినీ, కాగ్నిజెంట్, టీసీఎల్ వంటి 25కి పైగా ప్రముఖ బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు సాధించారు. ఏడాదికి రూ.52 లక్షలు, రూ.19 లక్షలు, రూ.16.85 లక్షలు, రూ.12.30 లక్షలు, రూ.9 లక్షలు, రూ.7 లక్షలు, రూ.6 లక్షలు, రూ.4 లక్షలు, రూ.3.50 లక్షల వేతన ప్యాకేజీలతో వందమందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. ఎన్నో సంస్థల్లో ఉద్యోగాలకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నట్లు కళాశాల చైర్మన్న్ జువ్వాడి సాగర్ రావు తెలిపారు. కళాశాల సెక్రెటరీ, కరస్పాండెంట్ జవ్వాడి సుమిత్ సాయి మాట్లాడుతూ, యంత్ర విద్యతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), శాప్ వంటి కోర్సుల్లో మైనర్ డిగ్రీ పట్టాలను అందిస్తున్నట్లు తెలిపారు. యూఎస్ఎలోని లూసియానా టెక్ యూనివర్సిటీ, వరంగల్లోని ఎస్ఆర్ యూనివర్సిటీతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాలను సులభతరం చేశారు.
విద్యార్థులకు అభినందనలు
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. అనిల్ కుమార్, డీన అకాడమిక్స్ డాక్టర్ పీకే వైశాలి, విభాగాధిపతులు, అధ్యాపక బృందం ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.