తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలి | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలి

Jun 15 2025 7:23 AM | Updated on Jun 15 2025 7:23 AM

తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలి

తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలి

కొత్తపల్లి(కరీంనగర్‌): ప్రతీ విద్యార్థి తన జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేయాలని శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్‌ యు.ఉమేశ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్‌ సీతారాంపూర్‌లోని ఓ కన్వెన్షన్‌లో శ్రీఅల్ఫోర్స్‌ గ్రాడ్‌గాళా–25శ్రీ పేరిట నిర్వహించిన అల్ఫోర్స్‌ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల గ్రాడ్యూయేషన్‌ డే వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాలను చేరుకుంటూ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. ఉపాధ్యాయుల విలువలను గూగుల్‌ సంపూర్ణం చేయలేదని, అందుకే వారిని గౌరవించాలని సూచించారు. అల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డా.వి.నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు పీజీ విద్యతో పాటు రీసెర్చ్‌, ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలన్నారు. కళాశాల కరస్పాండెంట్‌ వి.రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, 25 ఏళ్లుగా తమ కళాశాల అనేక కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థుల బంగారు భవిషష్యత్‌కు బాటలు వేస్తోందన్నారు. అనంతరం 2022 నుంచి 2024 వరకు డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు వీసీ గ్రాడ్యూయేషన్‌ సర్టిఫికెట్లు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

శాతవాహన వీసీ ఉమేశ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement