
ఇంటి అనుమతి కోసం నిలదీత
కరీంనగర్ కార్పొరేషన్: ‘మమ్మల్ని ఎన్ని రోజులు తిప్పుకుంటవ్. కావాలనే ఇబ్బంది పెడుతున్నవ్. మా ఇంటికి పర్మిషన్ ఎందుకు ఇస్తలెవ్. మాకు మాత్రమే వేరే రూల్స్ ఉంటయా’.. అంటూ ఓ మహిళ బల్దియా టీపీఎస్ సంధ్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబేడ్కర్నగర్కు చెందిన సంబోజి గంగాభవాణి తన 60గజాల స్థలంలో ఇంటి నిర్మాణానికి గతంలో దరఖాస్తు చేసుకుంది. బుధవారం బల్దియా కార్యాలయానికి వచ్చి ఇంటికి అనుమతి ఇవ్వకుండా తిప్పుకుంటున్నారంటూ, టీపీఎస్తో వాగ్వాదానికి దిగింది. ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వరాదంటూ ఫిర్యాదు ఉండడంతోనే, తాను సంబంధిత ధ్రువపత్రాలు అడిగానని టీపీఎస్ సంధ్య బదులిచ్చారు. కమిషనర్ చాహత్బాజ్పేయ్ ఆదేశాలతో పత్రాలు పరిశీలించిన పట్టణ ప్రణాళికాధికారి వేణు, మరిన్ని లింక్ డాక్యుమెంట్లు కావాలని సూచించడంతో వివాదం సద్దుమణిగింది.