పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలి

May 29 2025 8:39 AM | Updated on May 29 2025 8:39 AM

పశువు

పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలి

● సీపీ గౌస్‌ ఆలం

చొప్పదండి: పశువుల అక్రమ రవాణా నివారణకు అప్రమత్తంగా ఉండాలని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం సూచించారు. మండలంలోని ఆర్నకొండలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును బుధవారం రాత్రి తనిఖీ చేశారు. పశువుల అక్రమ రవాణా నివారణకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి వేళల్లో ప్రతీ గూడ్స్‌ వాహనాన్ని తనిఖీ చేయాలని తెలిపారు. పశవుల అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. ఆయన వెంట రూరల్‌ ఏసీపీ శుభం ప్రకాశ్‌, సీఐ ప్రదీప్‌ కుమార్‌, ఎస్సైలు మామిడాల సురేందర్‌, మనీషా పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు

కరీంనగర్‌స్పోర్ట్స్‌: మంచిర్యాల జిల్లాకేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించారు. యూత్‌ విభాగంలో ఎస్‌ఎల్‌ వరప్రసాద్‌, జూనియర్‌ విభాగంలో సుకుమార్‌ బంగారు పతకాలు, జి.సాకేత్‌ రజతం, సబ్‌ జూనియర్‌ విభాగంలో జి.హరిహర, జి.హరిణిశ్రీ కాంస్య పతకాలు సాధించినట్లు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి కొత్తకొండ సంపత్‌ కుమార్‌ తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులను బుధవారం జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అభినందించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా బాక్సింగ్‌ అసోసియేషన్‌ బాధ్యులు మోసం అంజయ్య, జి.సత్యనారాయణ పాల్గొన్నారు.

మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలి

కరీంనగర్‌రూరల్‌: మహిళలు రుతుస్రావసమయంలో సరైన పౌష్టికాహారం తీసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ సూచించారు. కరీంనగర్‌ మండలం మొగ్ధుంపూర్‌లోని ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న మహిళాకార్మికులకు బుధవారం ఆరోగ్య పరీక్షలు చేశారు. అంతర్జాతీయ రుతుస్రావ పరిశుభ్రత దినోత్సవంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ రుతుస్రావ సమయంలో మహిళలు కనీసం రోజుకు నాలుగైదు గంటలకోసారి శానిటరీ ప్యాడ్లు మార్చుకోవాలని, బలమైన ఆహారం తీసుకోవాలన్నారు. మాత్రలను వేసుకోవడంతో హార్మోన్ల సమతుల్యత లోపిస్తుందని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు. అనంతరం శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేశారు. కార్మికుల పిల్లలకు వ్యాక్సినేషన్‌ చేశారు. యూనిసెఫ్‌, హోప్‌ ఫర్‌ లైఫ్‌ పౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఐవో డాక్టర్‌ సాజిదా, పీవో ఎంసీహెచ్‌వో సనా జువేరియా, చామనపల్లి పీహెచ్‌సీ డాక్టర్‌ ఫిరోజ్‌, యూనిసెఫ్‌ జిల్లా కోఆర్డినేటర్‌ కిషన్‌స్వామి పాల్గొన్నారు.

బహుజన సామాజిక తెలంగాణే లక్ష్యం

కరీంనగర్‌: బహుజన సామాజిక తెలంగాణే టీఆర్‌ఎస్‌(డీ) లక్ష్యమని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ పేర్కొన్నా రు. నగరంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు జయపాల్‌గౌడ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చిగుర్ల రాజు ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో పార్టీ నిర్మాణం జరుగుతోందని, 119 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాలకు ఇన్‌చార్జీలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీగా చిగుర్ల రాజు, వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జీగా పోలే శ్రీనివా సును ప్రకటించారు. ఆదిలాబాద్‌, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల అధ్యక్షులు గంగాధర్‌, గుంటుక సంపత్‌, వాసంపల్లి ఆనంద్‌బాబు, పెద్దపల్లి ఎస్సీసెల్‌ అధ్యక్షుడు రమేశ్‌ పాల్గొన్నారు.

పశువుల రవాణాపై   అప్రమత్తంగా ఉండాలి1
1/2

పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలి

పశువుల రవాణాపై   అప్రమత్తంగా ఉండాలి2
2/2

పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement