మహాశక్తి ఆలయంలో పూజలు | - | Sakshi
Sakshi News home page

మహాశక్తి ఆలయంలో పూజలు

Mar 20 2025 1:47 AM | Updated on Mar 20 2025 1:44 AM

కరీంనగర్‌టౌన్‌: కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి బుధవారం శ్రీ మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శ్రీ మహాశక్తి అమ్మవార్ల దీవెనలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినట్లు తెలిపారు. తన విజయం కోసం కృషిచేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం శాసన మండలిలో గళం విప్పుతానన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ కార్పొరేటర్‌ కోలగని శ్రీనివాస్‌, బండ రమణారెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement