ఎంపీ, ఎమ్మెల్యేలకు గుణపాఠం తప్పదు | - | Sakshi
Sakshi News home page

ఎంపీ, ఎమ్మెల్యేలకు గుణపాఠం తప్పదు

Mar 23 2023 12:44 AM | Updated on Mar 23 2023 12:44 AM

చక్కెర పరిశ్రమ ఎదుట దిష్టిబొమ్మ దహనం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు - Sakshi

చక్కెర పరిశ్రమ ఎదుట దిష్టిబొమ్మ దహనం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

మల్లాపూర్‌(కోరుట్ల):జిల్లాలోని నిజాం చక్కెర పరిశ్రమను తెరింపించకుంటే వచ్చే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు గుణపాఠం తప్పదని టీపీసీసీ నాయకుడు జువ్వాడి కృష్ణారావు హెచ్చరించారు. ముత్యంపేట నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ ఎదుట కాంగ్రెస్‌ శ్రేణులు చెరుకు రైతులతో కలిసి బుధవారం ధర్నా చేశారు. సీఎం కేసీఆర్‌, ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు దిష్టిబొమ్మలు దహనం చేశారు. అనంతరం కృష్ణారావు మాట్లాడారు. ముత్యంపేట నిజాం దక్కన్‌ షుగర్‌ ఫ్యాక్టరీ 35 ఏళ్ల తర్వాత తొలిసారి స్వరాష్ట్రంలోని తెలంగాణ ప్రభుత్వ హయాంలో మూతపడడం శోచనీయమన్నారు. దీంతో చెరుకు రైతులు తమ పంటను కామారెడ్డికి తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే 100రోజుల్లోనే చక్కెర పరిశ్రమలను స్వాధీనం చేసుకుంటామన్న టీఆర్‌ఎస్‌, ఎంపీగా గెలిస్తే సొంత డబ్బు వెచ్చించి ఫ్యాక్టరీ కోనుగోలు చేసి నడుపుతానన్న బీజేపీ ఎంపీ అర్వింద్‌ తమ హామీలు విస్మరించారని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి షుగర్‌ ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఇదే డిమాండ్‌పై ప్రతినెలా 22నవ తేదీన ఒక్కో గ్రామం నుంచి షుగర్‌ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర నిర్వహిస్తామని, ఈ ప్రక్రియ వచ్చే అక్టోబరు వరకు సాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్‌ కంది బుచ్చిరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పూండ్ర శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పోతు శేఖర్‌, రాజిరెడ్డి, బాలసాని ప్రణయ్‌గౌడ్‌, కడకుంట్ల సాయికుమార్‌, యాల శేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌, కా సార భూమక్క, గడ్డం లింగారెడ్డి, అచ్చ రాజేశం, అరుణ్‌రెడ్డి, మగ్గిని నరేశ్‌, చిన్నఅంజన్న, చింతలపల్లి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిజాం చక్కెర పరిశ్రమలు తెరిపించాలి

టీపీసీసీ నాయకుడు జువ్వాడి కృష్ణారావు

ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీ ఎదుట కాంగ్రెస్‌ శ్రేణుల ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement