శోభకృత్ శుభాలకు నాంది
జ్యోతినగర్: శ్రీశోభకృత్ ఉగాది శుభాలకు నాంది అ ని ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటీవ్ డైరెక్ట ర్ సునీల్కుమార్ అన్నారు. బుధవారం తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా ఎన్టీపీసీ రామగుండం పీటీఎస్లోని జ్యోతిక రిక్రియేషన్ క్లబ్ మ్యూజిక్ హాలులో పంచాంగ శ్రవణం, కవి సమ్మేళ నం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజ రై మాట్లాడుతూ.. కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాల ను ఎంచుకుని వాటిని ప్రణాళికాబద్దంగా అమలుచేసుకోవాలన్నారు. అర్చకులు వామనశర్మ, రుధ్రభట్ల శ్రీకాంత్ శర్మలు పంచాంగ శ్రవణం వినిపించారు. అ నంతరం కవిసమ్మేళనంలో పలువురు కవులు తమ కవితలను వినిపించారు. ఉగాది షడ్రుచుల పచ్చడి, మిఠాయిలు అందించారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్లు దేశాయ్, జ్యోతిక క్లబ్ అధ్యక్షుడు అనిల్కుమార్, కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, కార్పొరేటర్ కొలిపాక సుజాత, ఉద్యోగ గుర్తింపుసంఘం ప్రతిని ధులు, వివిధయూనియన్ల సభ్యులు పాల్గొన్నారు.
ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సునీల్కుమార్