బీఎస్ఎన్ఎల్ ఆఫీస్లో మంటలు
కరీంనగర్క్రైం: పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి. పరిశీలించిన స్థానికులు ఫైరింజన్కు సమాచారం అందించగా అప్పటికే ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు మంటలు వ్యాపించి, పొగతో నిండిపోయింది. ఫైర్ సిబ్బంది లోనికి వెళ్లేందుకు వీలులేకపోవడంతో మంటలను ఆర్పుతూ అదుపులోకి తెచ్చారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి ఉగాది రోజు సెలవుదినం కావడంతో ఉద్యోగులెవరూ రాలేదని తెలిసింది. రెండస్తుల్లోని వైర్లు, మిషనరీ కాలిపోయినట్లు ఫైర్సిబ్బంది అధికారులు చెబుతున్నారు. నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని పూర్తిస్థాయి విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని కరీంనగర్ డివిజన్ ఫైర్ అధికార తగరం వెంకన్న తెలిపారు. ప్రమాదానికి ప్రాథమికంగా షార్ట్సర్క్యూట్ కారణమని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.
రెండు అంతస్తుల్లో అంటుకున్న వైనం
మంటలను అదుపుచేసిన ఫైర్సిబ్బంది
షార్ట్సర్క్యూట్గా భావిస్తున్న అధికారులు