నాణ్యమైన ఫర్నిచర్ను విక్రయిస్తున్నాం
నిజామాబాద్ రూరల్: నగరంలోని వినాయక్నగర్లో ఉన్న త్రిమూర్తి ఎంటర్ ప్రైజెస్ షోరూంలో నాణ్యమైన ఫర్నిచర్ను విక్రయిస్తున్నట్లు సంస్థ స్థాపకులు కొండ వీరశేఖర్ గుప్తా తెలిపారు. సోమవారం షోరూంలో 50 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. షోరూంలో ప్రత్యేక పూజలు చేశారు. 1975లో దేవీరోడ్డులో స్థాపించామని, 2009లో వినాయక్నగర్లో అతిపెద్ద ఫర్నిచర్ షోరూమ్ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు తక్కువ ధరల్లోనే ఫర్నిచర్ను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కొండ శ్రవణ్, పవన్, నగర ప్రముఖులు పాల్గొన్నారు.


