
పేలుడు పదార్థాలతో సంబంధం లేదు
కామారెడ్డి టౌన్: శ్రీవారి వెంచర్లో నిల్వ చేసిన పేలుడు పదార్థాలతో తన భర్త చంద్రశేఖర్రెడ్డి కి ఎలాంటి సంబంధం లేదని మున్సిపల్ మా జీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ తెలిపారు. ఆ దివారం తన నివాసంలో విలేకరులతో మా ట్లాడారు. శ్రీవారి వెంచర్లో తమకు గుంట భూమి కూడా లేదన్నారు. కేపీఆర్ కాలనీలో దొ రికిన పేలుడు పదార్థాలకు, శ్రీవారి వెంచర్కు ముడి పెడుతున్నారని ఆరోపించారు. అ వెంచర్ను గతంలోనే వేరే వారికి అప్పజెప్పామన్నా రు. నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్టు చే సి జైలుకు తరలించడం సరికాదన్నారు. ఈ కే సులో తాము చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. సమావేశంలో నాయకులు కృష్ణమూర్తి, రవి, జూలూరి సుధాకర్, గడ్డమీది రాణి, సలీం తదితరులు పాల్గొన్నారు.