
బస్డిపోపై సీఎంతో చర్చిస్తా
పేదోడి ఎయిర్పోర్ట్..
– 9లో u
బుధవారం శ్రీ 25 శ్రీ జూన్ శ్రీ 2025
‘నాటిన మొక్కలను
సంరక్షించాలి’
కామారెడ్డి క్రైం: ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి ని సంరక్షించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. నషా ముక్త్ భారత్ వారం రోజుల కార్యక్రమాల్లో భాగంగా కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ క ళాశాల ఆవరణలో మంగళవారం కలెక్టర్ మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నషా ముక్త్ భారత్లో భాగంగా జిల్లా సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం, పర్యావర ణ పరిరక్షణ, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల పాల్గొన్నారు.
‘ప్రతి చిన్నారికి
టీకాలు వేయాలి’
భిక్కనూరు: ప్రతి చిన్నారికి తప్పనిసరిగా క్రమం తప్పకుండా టీకాలను వేయాలని రాష్ట్ర ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం అధికారి అఖిల్ సూచించారు. మంగళవారం భిక్కనూరు పీహెచ్సీని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ఎవరైనా చిన్నారులు టీకాలు తీసుకోవడంలో క్రమం తప్పితే వారిని గుర్తించి టీకాలు వేయాలని సూచించారు. దీనిపై తల్లిదండ్రులను అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలోని వ్యాక్సిన్ స్టోర్ రూమ్ను, వ్యాక్సిన్లను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా పరిశీలకులు శ్రీనివాస్, నగేష్, వైద్యురాలు యెమిమా, పార్మసిస్ట్ అధికారి స్వామి, ఆరోగ్య విస్తరణ అధికారి వెంకటరమణ, డాటా ఎంట్రీ అధికారి సిద్ధార్థ ఉన్నారు.
‘ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి’
కామారెడ్డి అర్బన్: ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని టీ ఎన్జీవోస్ హాల్లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పీ ఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు, బి ల్లులు మంజూరు చేయాలని, హెల్త్కార్డుల జారీ చేయాలని కోరారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ప్రమోషన్ పొంది మెదక్ జిల్లాకు బ దిలీ అయిన సహకార శాఖ ఉద్యోగి సాయి లును సన్మానించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ముల్కరాజు, అసో సియేట్ అధ్యక్షుడు చక్రధర్, కోశాధికారి దేవరాజు, ప్రతినిధులు లక్ష్మణ్, పోచయ్య, మ హిపాల్, శరణ్, సృజన్రెడ్డి, రమేష్, అజీమొద్దీన్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
30న హైదరాబాద్లో యాదవుల ఆత్మగౌరవ సభ
కామారెడ్డి టౌన్: హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఈనెల 30న నిర్వహించే యాదవుల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయా లని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో సభ వాల్పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుటుంబ, కులపాలన చేస్తూ యాదవులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వకపోవడం దారుణమన్నారు. యాదవులతోపాటు మున్నూరు కాపు, ఎంబీసీలకు కూడా మంత్రి పదవి ఇవ్వాలన్నారు. ఎన్నికలముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు అర్కల ప్రభాకర్ యాదవ్, నాయకులు మల్లేశ్ యాదవ్, జగదీశ్ యాదవ్, కృష్ణ యాదవ్, వాసు యాదవ్, కొమరయ్య, రాజు, పవన్, కిరణ్, మేకల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రేపు జిల్లా కేంద్రంలో ర్యాలీ
కామారెడ్డి క్రైం: మత్తు పదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలని ఎస్పీ రాజేశ్ చంద్ర మంగళవారం ఒక ప్రకటన ద్వారా కోరారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన కల్పించడానికి గురువారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలి పారు. ఉదయం 9 గంటలకు సీఎస్ఐ చర్చి గ్రౌండ్ నుంచి కళాభారతి వరకు ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు. మత్తు పదార్థాలు యువత భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని, వాటితో కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెంచే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రతి ఒక్కరూ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డిరూరల్ : ఎల్లారెడ్డిలో బస్డిపో ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు కోరారని, ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చర్చిస్తానని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం ఎల్లారెడ్డికి విచ్చేసిన మంత్రికి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర పుష్పగుచ్ఛాలు అందించారు. అనంతరం ఎల్లారెడ్డిలో రూ. 5 కోట్లతో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ను మంత్రి పొన్నం ప్రభాకర్, విచారణ కేంద్రాన్ని ఎమ్మెల్యే మదన్మోహన్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రేషన్కార్డులపై సన్నబియ్యం పథకాన్ని తెలంగాణలో అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు అందని ద్రాక్షగానే మిగిలాయన్నారు. తాము ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామన్నారు.
తొమ్మిది రోజులలో రూ. 9 వేల కోట్లు..
రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో జమ చేశామని మంత్రి తెలిపారు. తొమ్మిది రోజులలో రూ.9 వేల కోట్లు అందించామన్నారు. 126 మహిళా సంఘాలకు మంజూరైన రూ. 10 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కును మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళా సంఘాలకు అందించారు.
ఎల్లారెడ్డిలో నిర్మించిన బస్టాండ్ ను పేదోడి ఎయిర్పోర్టుగా ఎమ్మెల్యే మదన్మోహన్రావు అభివర్ణించారు. ఎల్లారెడ్డి వెనకబడిన ప్రాంతమన్నారు. గత ప్రభుత్వంలో బస్టాండ్ నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయిందని, తాను రూ. 3.5 కోట్ల నిధులు మంజూరు చేయించి నిర్మాణాన్ని పూర్తి చేయించానని పేర్కొన్నారు. రూ. 40 లక్షలతో ఫ్లడ్లైట్లు, 200 ఫీట్ల సీసీ రోడ్డు వేయించామని తెలిపారు. రూ. 74 కోట్లతో నిర్మించే ఏటీసీ సెంటర్కు భూమిపూజ చేశామన్నారు. ఈ ప్రాంతవాసుల ఎన్నో ఏళ్ల కల అయిన బస్డిపోను మంజూరు చేయాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యేల క్ష్మీకాంతారావు, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, డీఆర్డీవో సురేందర్, అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్, ఆర్డీవో వీణ, మున్సిపల్ కమిషనర్ మహేష్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు, ఏఎంసీ చైర్మన్ రజిత, మున్సిపల్ మా జీ చైర్మన్లు పద్మ శ్రీకాంత్, కుడుముల సత్యనారాయణ, నాయకులు ప్రశాంత్గౌడ్, సాయిబాబా, నారాగౌడ్, శ్రీధర్గౌడ్, వినోద్గౌడ్, లింగాగౌడ్ పాల్గొన్నారు.
మారుమూల గ్రామాల్లో
విద్యాభివృద్ధికి ప్రాధాన్యత
గాంధారి(ఎల్లారెడ్డి): మారుమూల గ్రామాల్లో వి ద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు పేర్కొన్నారు. మండల పరిధిలోని పల్లెల మడుగు తండాలో మంగళవారం ఎంఈవో శ్రీహరితో కలిసి డీఈవో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలన్నారు. విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా తండావాసులు డీఈవో రాజు, ఎంఈవో శ్రీహరిలను సన్మానించారు.
వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, డీఎఫ్వో నిఖిత, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్
కామారెడ్డి క్రైం : వన మహోత్సవం లక్ష్యాలను సా ధించాలని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ సూచించారు. మంగళవారం రాష్ట్ర ప్రభు త్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి హై దరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ వన మహోత్సవం నిర్వహించాలన్నారు. రోజూ ఒక శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటాలన్నారు. అటవీ ప్రాంతాల్లో కోతులకు అవసరమై న పండ్ల మొక్కలను పెంచాలన్నారు. ఆగస్టు 15 లో గా భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. భారీ వర్షాలు కురవకముందే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు బేస్మెంట్ స్థాయి వరకు పూర్తయ్యేలా చూడాలన్నారు. పీఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రతి పట్టణంలో కనీసం 500 మంది నిరుపేదలకు ఇందిర మ్మ ఇళ్లను మంజూరు చేయాలని కలెక్టర్లకు సూ చించారు. ఆయిల్పాం పంట విస్తరణకు చర్యలు తీ సుకోవాలన్నారు.
32,592 దరఖాస్తులు..
భూ భారతి రెవెన్యూ సదస్సులలో జిల్లాలో 32,592 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. వాటిలో 27,223 దరఖాస్తులను ఆన్లైన్ లో పొందుపరిచామన్నారు. దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి 7,269 నోటీసులు జారీ చేశామన్నారు. ఆయా దరఖాస్తులను వేగంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీసీలో డీఎఫ్వో నిఖిత, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, హౌసింగ్ పీడీ జ్యోతి, డీఎంహెచ్వో చంద్రశేఖర్, డీఆర్డీవో సురేందర్ పాల్గొన్నారు.
నిజామాబాద్లీగల్/డొంకేశ్వర్: జిల్లాలో డ్రైపోర్టు సాధించేందుకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పో రాడుదామని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల బాధ్యులు, ఇతర సంఘాల ప్రతినిధులు నిర్ణయించారు. ఇందుకోసం ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లేందుకు తీర్మానం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 29న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్షాను కలిసి విన్నవించేందుకు సిద్ధమయ్యారు. తర్వాత ఢిల్లీ వెళ్లి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. మంగళవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ప్ర కాష్ హ్యుందయ్ షోరూంలో నిజామాబాద్ జిల్లా లో డ్రైపోర్టు ఏర్పాటు కోరుతూ చర్చ వేదిక జరిగింది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో పండుతున్న పసుపు, ధాన్యం, సోయా, మొక్కజొన్న, ఎర్రజొన్న, పత్తి, మామిడి పంటలకు అదనపు విలువ జోడించడంతో పాటు సిరిసిల్ల జిల్లాల్లో నేతన్నల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్కు నేరుగా ఎగుమతి చేసేందుకు డ్రైపోర్టుతో అవకాశం కలుగుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. పైగా ఈ ప్రాంతంలో రూ. వెయ్యి కోట్ల ఎకానమీ సాధ్యమవుతుందన్నారు. అన్నిరంగాల్లో వివిధ యూనిట్లు ఏర్పాటై యువత కు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నా రు. డ్రైపోర్టు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తి డి పెంచేందుకు కచ్చితమైన కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్లాలని తీర్మానం చేశారు. చర్చ వేదిక సమన్వయకర్తగా సాక్షి బ్యూరో ఇన్చార్జి తుమాటి భద్రారెడ్డి వ్యవహరించారు.
అన్ని పార్టీలు మద్దతు తెలపాలి
ఇందూరులో డ్రైపోర్ట్ ఏ ర్పాటు కోసం చాంబర్ ఆఫ్ కామర్స్ చేస్తున్న పోరాటానికి రాజకీయా లు అతీతంగా మద్దతు తెలపాల్సి ఉంది. దీని సాధన కోసం తెలంగాణ ఉద్య మం స్ఫూర్తిగా ముందుకెళదాం. డ్రైపోర్ట్ ఏర్పాటైతే జిల్లా అభివృద్ధికి టర్నింగ్ పాయింట్ అవుతుంది.
– రాజశేఖర్రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి
న్యూస్రీల్
ఆర్టీసీకి రూ. 6 వేల కోట్లు చెల్లించాం
రాష్ట్రంలో ఆర్టీసీలో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసినప్పటినుంచి ఇప్పటివరకు మహిళలు 190 కోట్ల సార్లు ఉచితంగా బస్సులలో ప్రయాణించారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందుకుగాను ప్రభుత్వం ఆర్టీసీకి రూ. 6,008 కోట్లు చెల్లించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ ఉంటుందా, మూసివేస్తారా అన్న పరిస్థితి ఉండేదని, అప్పటి ప్రభుత్వ ధోరణితో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఏళ్లనాటి సమస్యలను పరిష్కరించి వారి జీవన స్థితిగతులు మారుస్తోందన్నారు. జిల్లా కేంద్రాలైన ములుగు, పెద్దపల్లి పట్టణాల్లో బస్ డిపోలను ఏర్పాటు చేశామన్నారు.
పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం
రోడ్డు రవాణా శాఖ మంత్రి
పొన్నం ప్రభాకర్
అటవీ ప్రాంతాల్లో
పండ్ల మొక్కలు నాటాలి
వీసీలో అటవీ, పర్యావరణ శాఖల
మంత్రి కొండా సురేఖ

బస్డిపోపై సీఎంతో చర్చిస్తా

బస్డిపోపై సీఎంతో చర్చిస్తా

బస్డిపోపై సీఎంతో చర్చిస్తా

బస్డిపోపై సీఎంతో చర్చిస్తా

బస్డిపోపై సీఎంతో చర్చిస్తా

బస్డిపోపై సీఎంతో చర్చిస్తా

బస్డిపోపై సీఎంతో చర్చిస్తా

బస్డిపోపై సీఎంతో చర్చిస్తా

బస్డిపోపై సీఎంతో చర్చిస్తా

బస్డిపోపై సీఎంతో చర్చిస్తా

బస్డిపోపై సీఎంతో చర్చిస్తా