మా భూములను మాకు ఇప్పించాలి | - | Sakshi
Sakshi News home page

మా భూములను మాకు ఇప్పించాలి

Jun 26 2025 10:02 AM | Updated on Jun 26 2025 10:02 AM

మా భూ

మా భూములను మాకు ఇప్పించాలి

తాడ్వాయి(ఎల్లారెడ్డి): అబ్దుల్లానగర్‌ శివారులో ఉన్న మా భూములను మాకు ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ బ్రహ్మాజీవాడికి చెందిన రైతులు బుధవారం తహసీల్‌ కార్యాలయానికి తరలి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అబ్దుల్లానగర్‌ శివారులో గల 89, 95, 106, 122 సర్వే నంబర్లలో 32 మందికి 40 ఎకరాల భూమి ఉందని, 43 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని అన్నారు. గతంలో ఉన్న తహసీల్దార్‌ల తప్పిదం వల్ల కొందరు దొంగ పత్రాలు సృష్టించి కోర్టుకు వెళ్లి ఆ భూము లు మావేనని అంటున్నారని వాపోయారు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు. లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్‌ శ్వేతకు వినతి పత్రాన్ని అందజేశారు.

మా భూములను మాకు ఇప్పించాలి 1
1/1

మా భూములను మాకు ఇప్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement