
నాణ్యమైన భోజనం అందించాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రభాకరచారి సూచించారు. నాగిరెడ్డిపేట మండలంలోని మాసాన్పల్లిలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. పంచాయతీ కార్యదర్శి సుభాష్రెడ్డి, పాఠశాల హెచ్ఎం నిహారిక ఉన్నారు.
ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని ఎంపీడీవో నరేష్ సూచించారు. బుధవారం ఆయన శెట్పల్లిలో నిర్మిస్తున్న ఇంకుడు గుంతను పరిశీలించారు. గ్రామాల్లో కార్యదర్శులు ప్రతీ ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట ఏపీవో నరేందర్, శివరాం ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
భిక్కనూరు: రాజన్న–సిరిసిల్ల జిల్లా అగ్రహారం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. బస్వాపూర్ గ్రామానికి చెందిన ఒంటెద్దు శేఖర్ (23) మూడేళ్లుగా వేములవాడలోని ఓ పెట్రోల్ బంక్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. బుధవారం టిఫిన్ చేసేందుకు అగ్రహారం వద్దకు బైక్పై వెళ్లి, తిరిగి వస్తుండగా టాటా ఏసీ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పోస్టుమార్టం అనంతరం బస్వాపూర్ గ్రామానికి రాత్రి తీసుకవచ్చారు. మృతుడికి తల్లి కళావతి ఉండగా, తండ్రి చిన్నతనంలోనే మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి లంబాడి యువసేవ తరపున ఐదువేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

నాణ్యమైన భోజనం అందించాలి