
ఉపాధ్యాయుడిపై దాడి చేసిన వ్యక్తిని శిక్షించాలి
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ హనుమాన్ మందిర్ స్కూల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడిపై విద్యార్థి సంఘ నేత దాడి చేయడం హేయమైన చర్య అని కామారెడ్డి ఉపాధ్యాయ సంఘాల నాయకులు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడారు. తక్షణమే ఆయనను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు దేవులా, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, ఎస్జీటీయూ జిల్లా అధ్యక్షుడు రాము, తదితరులు పాల్గొన్నారు.
దాడి హేయమైన చర్య
ఉపాధ్యాయుడిపై దాడి చేయడం హేయమైన చర్య అని తపస్ జిల్లా అధ్యక్షుడు పుల్గం రాఘవరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ వ్యక్తిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.