
రైతులే తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవచ్చు
వ్యవసాయ ఉత్పత్తుల్లో దేశంలోనే పేరుగాంచిన ఇందూరు జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటైతే రైతులే ఎగుమతిదారులు గా తయారవుతారు. దేశంలోనే భారీ పసుపు మార్కెట్లలో నిజామాబాద్ మొదటి వరుసలో ఉంది. పంట ఉత్పత్తు లకు అదనపు విలువ జోడించకుండా వచ్చిన వెంటనే అమ్మేస్తే రైతులకు ఆశించిన ధర దక్క డం లేదు. ఈ క్రమంలో జక్రాన్పల్లి మండలంలో ఐదు గ్రామా ల రైతులం కలిసి తెలంగాణలోనే మొదటి పసుపు క్లస్టర్ను ఏర్పాటు చేశాం. రైతులు పండించిన పంటతో ఆర్గానిక్ పసుపు పౌడర్ను తయారుచేసి విక్రయిస్తున్నాం. డ్రైపోర్టు ఏర్పాటు చేస్తే రైతులకు మరింత మేలు చేకూరుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు యువతకు మరిన్ని అవకాశాలు సృష్టించబడతా యి. గల్ఫ్ దేశాలకు వెళ్లి పనిచేసే అవసరం ఉండదు. ఆత్మనిర్భర్ భారత్ కింద జిల్లాకు డ్రైపోర్టును సాధించుకోవాలి. అందరం కలిసి పిడికిలి బిగిస్తేనే డ్రైపోర్టు కల సాకారమవుతుంది. ఎంపీ అర్వింద్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్లను కలుద్దాం.
– పాట్కూరి తిరుపతిరెడ్డి,
పసుపు ఎఫ్పీవో చైర్మన్