
అక్రమ కట్టడాల కూల్చివేత
మాచారెడ్డి: పాల్వంచ మండలం భవానీపేట తండా పాఠశాల స్థలంలో చేపట్టిన అక్రమ కట్టడాలను మంగళవారం రెవెన్యూ అధికారులు కూల్చివేసి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాల్వంచ తహసీల్దార్ హిమబిందు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తండాకు చెందిన గుగులోతు జమున, బానోత్ పింటు పాఠశాల స్థలాన్ని ఆక్రమించి బాత్రూమ్, ప్రహరీలు నిర్మించుకున్నారు. పాఠశాల హెచ్ఎం రమ్య ఫిర్యాదు మేరకు అక్రమార్కులకు నోటీసులు జారీ చేశారు. నోటీసులను ఖాతరు చేయకపోవడంతో మాచారెడ్డి ఎస్సై అనిల్, ఆర్ఐ శ్రీనివాస్రెడ్డి మంగళవారం సిబ్బందితో వెళ్లి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారని తహసీల్దార్ తెలిపారు.