ఘనంగా బసవేశ్వర జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బసవేశ్వర జయంతి

May 1 2025 12:28 AM | Updated on May 1 2025 12:28 AM

ఘనంగా

ఘనంగా బసవేశ్వర జయంతి

కామారెడ్డి అర్బన్‌/ బాన్సువాడ రూరల్‌/ బిచ్కుంద/ పెద్దకొడప్‌గల్‌/ ఎల్లారెడ్డి/ పిట్లం/ కామారెడ్డిటౌన్‌: కవి, ఆధ్యాత్మిక తత్వవేత్త, సంఘ సంస్కర్త బసవేశ్వర జయంతిని బుధవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలు ప్రజా, రాజకీయ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థలో సంస్థ జిల్లా చైర్మన్‌ మద్ది చంద్రకాంత్‌రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. బసవేశ్వరుడు కుల వ్యవస్థ లేకుండా అందరికి సమాన అవకాశాలుండాలని ఆకాంక్షించారని అన్నారు. బాన్సువాడలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీకళాశాలలో బసవేశ్వర జయంతి నిర్వహించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గులాం ముస్తఫా, అక్బర్‌ బాషా, పోతరాజు శ్రీనివాస్‌, విఠల్‌, శంకర్రావు, అంబయ్య, బాలరాజు, వినయ్‌కుమార్‌, చిరంజీవి, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలోని రాజుల్లా చౌరస్తాలో బిచ్కుంద బండయప్ప మఠం ఫీఠాధిపతి శ్రీ సోమయప్ప స్వామి, బీజేపీ నాయకులు అరుణతార జెండా విష్కరణ చేశారు. అనంతరం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మల్లికార్జునప్ప షెట్కార్‌, నాగ్‌నాథ్‌ పటేల్‌, మాశెట్టి సంజీవ్‌, రాజు పటేల్‌, నాయకులు పాల్గొన్నారు. పెద్దకొడప్‌గల్‌ మండల కేంద్రంలోని వీరశైవ లింగాయత్‌ మండల అధ్యక్షుడు సంతోష్‌ దేశాయ్‌ బసవేశ్వర పతాకాన్ని ఆవిష్కరించారు. బసవేశ్వర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు మహేందర్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు విజయ్‌ దేశాయ్‌, వివిధ పార్టీల నాయకులు, లింగాయత్‌ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో బసవేశ్వరుడి జయంతిని పురస్కరించుకుని వీరశైవ లింగాయత్‌ సంఘం అధ్యక్షులు వీరప్ప నీలకంఠేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వీరశైవ సంఘం నాయకులు బసప్ప, రామప్ప, సంగమేశ్వరప్ప తదితరులున్నారు. పిట్లం మండలంలోని కంబపూర్‌లో వీరశైవ లింగాయత్‌ ఆధ్వర్యంలో బసవేశ్వర జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా బసవేశ్వర విగ్రహావిష్కరణ చేశారు. విగ్రహానికి గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వీరశైవ లింగాయత్‌ సభ్యులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయశంకర్‌ కాలనీలో ఉన్న ఓంకారేశ్వరాలయంలో వీరశైవ లింగాయత్‌ సమాజ్‌ సభ్యులు బసవేశ్వర జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కంది శివరాములు, వీరన్న పటేల్‌, పట్నం శెట్టి శ్రీనివాస్‌, ఎం ఆంజనేయులు, జీవన్‌ దేశాయ్‌, పటేల్‌ రాజు, బండాయ స్వామి, మారుతి, చంద్రం, ఇంద్రశేఖర్‌, రామ శంకర్‌, అర్చకులు అవినాష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బసవేశ్వర జయంతి 1
1/2

ఘనంగా బసవేశ్వర జయంతి

ఘనంగా బసవేశ్వర జయంతి 2
2/2

ఘనంగా బసవేశ్వర జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement