గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు | - | Sakshi
Sakshi News home page

గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు

Jun 2 2025 1:19 AM | Updated on Jun 2 2025 1:19 AM

గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు

గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు

నిజాంసాగర్‌(జుక్కల్‌): గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వ పరంగా పోలీస్‌ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినా గోవుల అక్రమ రవాణాకు అడ్డుకట్టపడటం లేదు. రాత్రి వేళల్లో ట్రక్కులు, డీసీఎంలు, ఐచర్‌ వాహనాల్లో గోవులను గోవధశాలలకు తరలిస్తున్నారు. మహమ్మద్‌ నగర్‌ మండలం బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద శనివారం అర్ధరాత్రి డీసీఎం వాహనంలో గోవులను అక్రమంగా తరలిస్తుండగా స్థానిక బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సదరు వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు ద్విచక్రవాహనాలతో వెంబడించి వాహనాన్ని పట్టుకున్నారు. సదరు వాహనంలో 9 ఎద్దులు ఉండటంతో పోలీసులకు బీజేపీ కార్యకర్తలు సమాచారం అందించారు. వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 9 ఎద్దులను తిర్మలాపూర్‌ గోశాలకు తరలించారు.

అచ్చంపేట వద్ద 26 గోవులు

నిజాంసాగర్‌ మండలం అచ్చంపేట గ్రామం నుంచి శనివారం అర్ధరాత్రి వేళ ట్రక్కులో తరలిస్తున్న 26 గోవులు(ఎద్దులు)లను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ట్రక్కు వాహనాన్ని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, బీజేపీ కార్యకర్తలు సదరు ట్రక్కులో గోవులను శాంతాపూర్‌ గోశాలకు తరలించారు. పట్టుబడిన గోవులు, ఎద్దులను గోశాల నిర్వహకులకు అప్పగించారు.

అర్థరాత్రి వేళ వాహనాల్లో

తరలిస్తున్న వైనం

గోశాలలకు అప్పగింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement