
అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చాలి
బాన్సువాడ రూరల్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను నెర వేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభు త్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్లో దళిత నాయకులు, అంబేడ్కర్ యువజనసంఘం ప్రతినిధులతో కలిసి బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. అనంతరం గ్రామ స్తులు పోచారంను సన్మానించి అంబేడ్కర్ ప్రతిమ ను బహూకరించారు. కార్యక్రమంలో నాయకులు మాలెపు నారాయణరెడ్డి, కాసుల రోహిత్, నెర్రె నర్సింహులు, ఉద్దర హన్మాండ్లు, బంగారు మైస య్య, గ్రామ అధ్యక్షులు శివయ్య, చెట్లూరి సాయి లు, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
బాబాసాహెబ్ అందరివాడు..
బిచ్కుంద(జుక్కల్): డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని, ఆయన అందరివాడని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సిర్సముందర్లో బుధవారం అంబేడ్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. విగ్రహ దాత, కాంగ్రెస్ నాయకుడు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు సీమ గంగారాంను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు మల్లికార్జునప్ప షెట్కార్, విఠల్రెడ్డి, వెంకట్రెడ్డి, నాగ్నాథ్, ధర్పల్ గంగాధర్, సీమ గంగారాం, గోపాల్రెడ్డి, నాగనాథ్ పటేల్, దళిత నాయకులు తుకారాం, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చాలి