
‘ఎక్స్’లో జిల్లా బాస్లు యాక్టివ్!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : సామాజిక మాధ్యమాలు ముఖ్యంగా ‘ఎక్స్’లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర యాక్టివ్గా ఉంటున్నారు. రోజువారీగా జరిగే కార్యక్రమాలు, సక్సెస్లు ఎప్పటికప్పడు ఎక్స్ ఖాతాలలో పోస్ట్ చేస్తున్నారు. తమ బాస్లు పోస్ట్ చేసిన వాటిని అధికారులు, సిబ్బంది వివిధ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. కలెక్టర్ కామారెడ్డి పేరుతో ఉన్న ఖాతాలో 7,628 మంది ఫాలోవర్స్ ఉన్నారు. కలెక్టర్ సంగ్వాన్ రోజూ తాను పాల్గొన్న ముఖ్యమైన కార్యక్రమాలు, ముఖ్యమైన విషయాలను అందులో పోస్ట్ చేస్తున్నారు. దీంతో వేలాది మంది వాటిని చూస్తున్నారు. అలాగే ఎస్పీ కామారెడ్డి పేరుతో ఉన్న ఖాతాను 5,813 మంది అనుసరిస్తున్నారు. ఎస్పీ రాజేశ్ చంద్ర కూడా రోజూ చాలా అంశాలను పోస్ట్ చేస్తున్నారు. వివిధ కేసుల్లో నేరస్తులను అరెస్టు చేసిన అంశాలతో పాటు పోలీసు అధికారులతో సమీక్షలు, వివిధ సందర్భాల్లో సిబ్బంది చేసిన కృషిని మెచ్చుకుంటూ వారిని అభినందించిన ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. ఇలా కలెక్టర్, ఎస్పీలు ఎప్పటికప్పుడు ‘ఎక్స్’లో క్రియాశీలకంగా ఉంటూ వివిధ విషయాలను పోస్ట్ చేస్తుండగా.. వాటిని కింది స్థాయి సిబ్బంది, అధికారులు ఇతర సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.
కలెక్టర్, ఎస్పీలకు భారీగా ఫాలోవర్లు
రోజువారీ కార్యక్రమాల అప్డేట్..

‘ఎక్స్’లో జిల్లా బాస్లు యాక్టివ్!