
జాతరలో తప్పిపోయిన పాప
నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేటలో జరుగుతన్న నల్లపోచమ్మ జాతర ఉత్సవాల్లో మంగళవారంరాత్రి మూడేళ్ల పాప తప్పిపోయింది. ఆలయ పరిసరాలలో ఒంటరిగా ఏడుస్తూ నిలబడ్డ పాపను గమనించిన నాగిరెడ్డిపేట పోలీసులు అక్కున చేరుకొని తల్లిదండ్రుల వివరాలను రాబట్టారు. తన తండ్రి పేరు సురేందర్ అని, తల్లి పేరు సౌజన్య అని, తమ ఊరు గాజిరెడ్డిపల్లి అని మాత్రమే పాప తెలిపింది. దీంతో పాప తప్పిపోయిన విషయాన్ని, ఈమె కుటుంబసభ్యుల వివరాలను వారు సోషల్మీడియాలో వైరల్ చేశారు. కొద్దిసేపటికీ పాప సంబందీకులు ఆలయం వద్ద పోలీసుల వద్దకు చేరుకొని జాతరలో తప్పిపోయిన పాప తమ పాపేనని చెప్పారు. దీంతో పూర్తి విచారణ చేపట్టిన కానిస్టేబుల్ గంగారాం పాపను కుటుంబసభ్యులకు అప్పగించారు.
జీజీహెచ్లో బాలుడు..
ఖలీల్వాడి: నగరంలోని జీజీహెచ్ నుంచి తప్పిపోయిన బాలుడిని తల్లికి అప్పగించినట్లు ఎస్హెచ్వో రఘుపతి మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని గౌతంనగర్కు చెందిన కేషిరెడ్డి లత తన రెండున్నరేళ్ల బాబును తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కు వచ్చింది. ఈ క్రమంలో బాబు ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. బస్టాండ్ ఏరియాలో డ్యూటీలో ఉన్న మహిళా హెడ్ కానిస్టేబుల్ బాబును చేరదీసి తన తల్లికి అప్పగించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొని బయటకు వచ్చినప్పుడు వారిపై దృష్టి పెట్టాలని ఎస్హెచ్వో కోరారు.
అక్కున చేర్చుకొని తల్లిదండ్రులకు
అప్పగించిన పోలీసులు

జాతరలో తప్పిపోయిన పాప