రాజంపేట: స్థానిక పీహెచ్సీ పరిధిలో మంగళవారం ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ విజయమహాలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 65 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించమన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సంగీత, సూపర్వైజర్ మంజూర్,ల్యాబ్ టెక్నీషీయన్ సంతోష్ పాల్గొన్నారు.
చలివేంద్రం ప్రారంభం
బీబీపేట: మండలంలోని యాడారం, శివారు రాంరెడ్డిపల్లి గ్రామాల్లో మన ఊరు – మేము సైతం ఫౌండేషన్ సభ్యులు చలివేంద్రాలు మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
అవార్డు గ్రహీతకు సన్మానం
తెయూ(డిచ్పల్లి): తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో ఈనెల 23 జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాంగ్రెస్–2025 కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగం సీనియర్ ప్రొఫెసర్ ఎం.అరుణకు బోధన, పరిశోధన విభాగంలో ఇంటర్నేషనల్ అవుట్ స్టాండింగ్ రీసెర్చ్ అవార్డు లభించింది. ఈసందర్భంగా అవార్డు గ్రహీత అరుణను మంగళవారం తెయూ వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి అభినందించి, సన్మానించారు. వృక్షశాస్త్ర విభాగాధిపతి హలీంఖాన్, ప్రొఫెసర్ విద్యావర్థిని, అధ్యాపకులు శ్రీనివాస్, జలంధర్ తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట పీహెచ్సీలో ‘ఆరోగ్య మహిళ’
రాజంపేట పీహెచ్సీలో ‘ఆరోగ్య మహిళ’