
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
పెరవలి: పెళ్లి విషయంలో భార్య, కుమార్తె తన మాట వినడం లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ముక్కామల గ్రామానికి చెందిన కమాడి ధర్మారావు (40)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుని ఇటీవల ఓ సంబంధం తీసుకువచ్చాడు. అయితే భార్య, కుమార్తెలకు ఆ సంబంధం నచ్చలేదు. దీంతో నెల రోజులుగా వారికి నచ్చచెబుతూ వస్తున్నాడు. అయినా వారు ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెందిన ఈ నెల 20వ తేదీ పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. భార్య కమాడి సావిత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.