
అన్నదాతకు అండగా ఆర్కేలు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్నదాతలకు అండగా ఆర్బీకే వ్యవస్థను తీసుకువచ్చారు. సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రైతు భరోసా, పంట రుణాలు, విపత్తుల సమయంలో ఇన్పుట్ సబ్సిడీ, బీమా పరిహారం, పంట దిగుబడుల కొనుగోళ్ల వంటి వాటిలో ఈ ఆర్బీకేలు కీలక పాత్ర పోషించాయి. వీటి పేరును కూటమి సర్కార్ రైతు సేవా కేంద్రాలుగా మార్చి, అరకొర సేవలకే పరిమితం చేసింది. కొన్ని ఆర్బీకే భవనాలను ఇతర కార్యాలయాలకు వినియోగిస్తూండగా, మరికొన్ని తాళం వేసి కనిపిస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఆరేళ్ల క్రితం మాదిరిగానే మండల కేంద్రాలకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు కోటనందూరు మండలంలో 14 ఆర్బీకేలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇవి రైతులతో కళకళలాడుతూ ఉండేవి. ఖరీఫ్కు ముందు ఈ కేంద్రాల్లో రైతులతో సమావేశాలు, విత్తనాలు, ఎరువుల విక్రయాలు, సాగుపై అవగాహన, సేంద్రియ సాగు ప్రయోజనాలు, రైతు బీమా, పంట నష్టపరిహారం తదితర అనేక అంశాలపై రైతులను చైతన్యపరిచే వారు. అటువంటి కేంద్రాలు ఇప్పుడు కూటమి సర్కార్ నిర్వాకంతో తరచుగా మూతపడే కనిపిస్తున్నాయి.

అన్నదాతకు అండగా ఆర్కేలు