గోదావరిలో మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గోదావరిలో మృతదేహం లభ్యం

Apr 21 2025 12:10 AM | Updated on Apr 21 2025 12:10 AM

గోదావరిలో మృతదేహం లభ్యం

గోదావరిలో మృతదేహం లభ్యం

మృతుడు రాజమహేంద్రవరం వాసిగా గుర్తింపు

కొవ్వూరు: రాజమహేంద్రవరం ఆర్టీసీ కాలనీకి చెందిన సుంకర మదన్‌ కిశోర్‌ (45) అనే వ్యక్తి మృతదేహం ఆదివారం ఏరినమ్మ ఘాట్‌లో లభ్యమైనట్లు సీఐ పి.విశ్వం తెలిపారు. మృత దేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. శనివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదని రాజమహేంద్రవరం ప్రకాష్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో మృతుడి సోదరుడు పవన్‌ కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వ్యక్తి అదృశ్యం కేసు నమోదు చేశామని ఎస్సై జి.సతీష్‌ తెలిపారు. మృతుడు ఓఎన్‌జీసీలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో సోదరుడు పవన్‌కుమార్‌కి ఫోన్‌ చేసి తన కుమార్తె, తల్లితో మాట్లాడాలి ఇవ్వమని చెప్పి కొద్దిసేపు మాట్లాడాడని, అనంతరం నది ఒడ్డున తాళాలు పెట్టి స్నానానికి వెళ్తున్నట్టు చెప్పాడని ఫిర్యాదుల పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్నానానికి వెళ్లి నదిలో మునిగిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారని ఎస్సై సతీష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement