
సూపర్సిక్స్తో మోసం
సూపర్ సిక్స్ సహా గత ఎన్నికల్లో 130 హామీలు ఇచ్చి, మోసం చేసిన చంద్రబాబు సర్కార్పై జనం తిరగబడే రోజులు వచ్చేశాయి. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఏ ఒక్క హామీ అమలు చేయకుండా జనాన్ని నిలువునా దగా చేశారు. అందుకే ప్రజాపక్షంగా ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు వైఎస్సార్ సీపీ వెన్నుపోటు దినం నిర్వహిస్తోంది. బలహీనవర్గాలకు రాయితీ రుణాలని గొప్పగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి ఏడాదైపోయినా ఒక్కరికై నా రుణం ఇచ్చారేమో చెప్పాలి. తీరని అన్యాయానికి గురైన బీసీలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది.
– అల్లి రాజబాబు, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు, బీసీ జేఏసీ కో కన్వీనర్, కాకినాడ
అన్ని వర్గాలకూ హ్యాండిచ్చారు
కూటమి సర్కార్ అన్ని వర్గాలకు హ్యాండిచ్చింది. ఏడాది పాలనలో అన్ని రంగాలనూ భ్రష్టు పట్టించింది. ఇచ్చిన హామీలన్నింటినీ గాలికొదిలేసింది. ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి, చివరకు ప్రజలను మోసం చేసింది.
– సుంకర విద్యాసాగర్,
వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి,
కాకినాడ జిల్లా

సూపర్సిక్స్తో మోసం

సూపర్సిక్స్తో మోసం