
ఆమైపె కక్ష గట్టి..
భావన,
కమిషనర్,
నగరపాలక
సంస్థ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఒక మహిళా ఐఏఎస్పై కూటమి నేతలు కక్ష కట్టారు. ఆమెను సాగనంపేందుకు తమ మధ్య ఉన్న విభేదాలన్నింటినీ పక్కన పెట్టి ఒక్కటయ్యారు. బిల్లుల కోసం వచ్చి, గద్దించి మాట్లాడిన టీడీపీ నేత కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే ఆమె చేసిన పెద్ద నేరమైంది. ఆమెను కొనసాగించవద్దని అందరూ పట్టుబడుతున్నారు. దీనికోసం జిల్లా టీడీపీలో సీనియర్ నాయకులందరూ అంతర్గతంగా ప్రత్యేక అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన బదిలీ కోసం కూటమి కట్టిన నేతల తీరు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
టీడీపీ నేత పుత్రరత్రం దుందుడుకు వ్యవహారం
ప్రజాసంబంధాలతో ముడిపడి ఉన్న ఐఏఎస్ అధికారులు.. ఏ హోదాలో ఉన్నా ఏ విషయంౖపైనెనా సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిందే. అందునా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాఫిర్యాదుల వేదికలో మరింత జాగరూకతగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. నాలుగున్నర లక్షల పైచిలుకు జనాభా కలిగిన కాకినాడ నగర పాలక సంస్థకు మహిళా ఐఏఎస్ భావన కమిషనర్గా పని చేస్తున్నారు. ఆమె కాకినాడ వచ్చి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. ప్రతి వారం మాదిరిగానే గత సోమవారం ఆమె ప్రజా ఫిర్యాదుల వేదికలో అర్జీలు స్వీకరిస్తున్నారు. ఆ క్రమంలో కమిషనర్ వద్దకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు తనయుడు, కాంట్రాక్టర్ అయిన గంగాధర రమేష్ వచ్చారు. అధికార పార్టీకి చెందిన కీలక నాయకుడి తనయుడిని కావడంతో తన మాటకు ఎదురుండదనుకున్నారో ఏమో కానీ.. పెండింగ్ బిల్లుల కోసం దుందుకుడుగా ప్రశ్నించారు. తాము చెప్పినట్టే అధికారులు, సిబ్బంది నడచుకోవాలనే మనస్తత్వాన్ని చంద్రబాబు దగ్గర నుంచి క్షేత్ర స్థాయిలో నేతల వరకూ అందరూ ఒంట పట్టించుకున్నట్టు ఈ సంఘటనతో అర్థమవుతోంది. బిల్లులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని గంగాధర రమేష్ గద్దించి మాట్లాడంతో మనస్తాపం చెందిన కమిషనర్ భావన.. దీనిపై అదనపు ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్కు ఎంహెచ్ఓ ద్వారా మొబైల్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కాస్త శ్రుతి మించి వ్యవహరించారనే విమర్శలున్నాయి.
బిల్లుల విషయం పక్కన పెట్టి..
బదిలీపై పట్టుబట్టి..
తమ పార్టీ నాయకుడి తనయుడి పైనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీడీపీ నాయకుల అహం దెబ్బ తిన్నట్టుంది. ఈ నేపథ్యంలో వారు బిల్లుల విషయాన్ని పక్కన పెట్టేసి, కమిషనర్ భావనను తక్షణం బదిలీ చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ విషయంపై తాడోపేడో తేల్చేస్తామంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. ఎంహెచ్ఓ ద్వారా పోలీసులకు కమిషనర్ ఫిర్యాదు చేయడంపై కూటమి ఎమ్మెల్యేలు కాకినాడలో అంతర్గతంగా భేటీ అయ్యారు. ఇది చర్చనీయాంశమైంది. మెట్ట ప్రాంతానికి చెందిన ఒక కీలక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగిన ఈ భేటీలో కమిషనర్ భావనను కాకినాడ నుంచి సాగనంపాల్సిందేనని ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులకు అల్టిమేటం ఇచ్చారని సమాచారం. దీనికి వారం రోజులు డెడ్లైన్ పెట్టినట్లు తెలిసింది. మెట్ట ప్రాంత నేతలకు కాకినాడ సిటీ, రూరల్ నేతలు కూడా తోడయ్యారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అడ్డగోలు పనులకు అడ్డమని...
వాస్తవానికి కమిషనర్ భావన, కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మధ్య ఆరు నెలల క్రితమే పలు అంశాల్లో విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచీ నగరంలో ఏ అధికారిక కార్యక్రమంలోనూ ఇద్దరూ కలిసి పాల్గొన్న దాఖలాలు లేవు. కాకినాడ దుమ్ములపేటలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపనకు ఎమ్మెల్యే కొండబాబు చివరి నిమిషంలో డుమ్మా కొట్టేశారు. వీరిద్దరి మధ్య విభేదాల విషయం తెలియక రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వచ్చినప్పటికీ.. కొండబాబు రాలేదని తెలిసి తిరిగి వెళ్లిపోయారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్కు మాత్రమే కుర్చీ వేసి, ఎమ్మెల్యేని విస్మరించారంటూ అప్పట్లో కొండబాబు వర్గీయులు బయట రచ్చరచ్చ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయినప్పటికీ ఇప్పటి వరకూ ఎమ్మెల్యే, కమిషనర్ కలసి అధికారులతో ఒక్క సమావేశం కూడా నిర్వహించిన దాఖలాలు లేవు. కార్పొరేషన్ కమిషనర్గా వచ్చిన తరువాత అధికార పార్టీ నేతలు చెప్పే అడ్డగోలు పనులకు భావన అడ్డు తగులుతూండటం టీడీపీ నేతలకు కంటగింపుగా మారింది. అయితే, అప్పట్లో ఆమైపె చర్యలకు సిఫారసు చేసేందుకు ధైర్యం చాలక కాకినాడ సిటీ టీడీపీ నేతలు కిమ్మనకుండా ఉండిపోయారు. ఇటీవల మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ కాకినాడ వచ్చిన సందర్భంలో సైతం టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కమిషనర్ భావనను మార్చాల్సిందేనని పట్టుబట్టారని ప్రచారం జరిగింది. తాజా ఘటనతో జిల్లాలోని టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులందరూ కూటమి కట్టి, కమిషనర్ బదిలీకి పావులు కదుపుతున్నారు. పట్టుమని పది నెలలు కూడా కాకుండానే ఆమెను సాగనంపేందుకు చేస్తున్న ప్రయత్నాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
నగరపాలక సంస్థ కార్యాలయం
మహిళా ఐఏఎస్కు వ్యతిరేకంగా
నేతల ‘కూటమి’
కాకినాడ కార్పొరేషన్ కమిషన్
బదిలీకి యత్నం
అంతా ఒక్కటై.. బదిలీకి వారం డెడ్లైన్
అధిష్టానానికి అల్టిమేటం
ఇదేం పద్ధతి?
వాస్తవానికి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు అనేది ప్రభుత్వం వద్దనే పెండింగ్లో ఉంది. ఈ చెల్లింపులు సీఎంఎఫ్ పరిధిలో ఉన్నాయి. అధికారం గుప్పిట్లో ఉందని జబ్బలు చరుచుకునే అధికార పార్టీ నేతలు ఉన్నత స్థాయిలో బిల్లులు మంజూరయ్యేలా ప్రయత్నించుకోకుండా కమిషనర్పై దుందుడుకుగా మాట్లాడితే ప్రయోజనమేమిటని, ఫిర్యాదు చేయడానికి వచ్చి, ఒక మహిళా ఐఏఎస్పై అంత దురుసుగా మాట్లాడటం సమంజసమా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అధికారం చేతిలో ఉందనే అహంకారంతో ఏం చేసినా చెల్లుతుందనే తెగింపుతోనే ఇలా వ్యవహరించారని అంటున్నారు. ఈ ఉదంతంలో కమిషనర్ భావన అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేయడంలో తప్పేముందని ఉద్యోగ సంఘాలు నిలదీస్తున్నాయి. బిల్లుల మంజూరులో కమిషనర్ వైఫల్యం ఏమైనా ఉంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, అయినప్పటికీ దుందుడుకుగా మాట్లాడాల్సిన పనేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఆమైపె కక్ష గట్టి..