
● భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లావ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పండగను శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. స్థానిక పిఠాపురం రోడ్డులోని ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జామియా మసీద్ ఇమామ్ అబ్దుల్ రజాక్ రిజ్వీ ఉదయం 8 గంటలకు ఈద్ నమాజు నిర్వహించారు. బక్రీద్ ప్రాముఖ్యతను వివరించారు. నూరానీ కమిటీ తరఫున జమాల్ శేర్ తనయుడు జుబేర్ పంపిణీ చేశారు. నూరానీ కమిటీ సభ్యులు రెహ్మన్ ఖాన్, లతీఫ్ఖాన్లు ఇమామ్ అబ్దుల్ రజాక్ రిజ్వీకి నూతన వస్త్రాలు అందజేసి ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. నమాజ్ అనంతరం ముస్లింలు పరస్పరం ఆలింగనం చేసుకుని ఈద్ ముబాకర్ చెప్పుకున్నారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు ఈద్ మైదానానికి చేరుకొని నమాజ్ ఆచరించడంతో ఆ మైదానంతో పాటు పిఠాపురం రోడ్డులో సందడి నెలకొంది.