
అక్రమాలు.. దందాలు
● కూటమి పాలనలో మట్టి, గ్రావెల్ మాఫియా, భూకబ్జాలు, ఆక్రమణలు, దందాలు, అక్రమ వసూళ్లతో తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు.
● తుని, పిఠాపురం ప్రాంతాల్లో దేవదాయ భూములకు వేలం జరగకుండా అడ్డం పడి దొడ్డిదారిన దోచుకునేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు.
● పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు ఎర్ర గ్రావెల్ కొండలను పిండి చేసి, వాటాలు వేసుకుంటున్నారు.
● కొత్త మద్యం పాలసీ పేరుతో ఊరూరా బెల్టు షాపులు, పర్మిట్ రూములకు అనుమతులిచ్చి జిల్లాను మత్తులో ముంచుతున్నారు. యువత మద్యం, గంజాయికి బానిసైపోయినా సర్కారు చెవికెక్కడం లేదు. మద్యాన్ని ఏరులై పారిస్తోంది. జిల్లాలో అధికారిక మద్యం దుకాణాలు 171 ఉండగా, సందుగొందుల్లో సుమారు 500 బెల్ట్ షాపులు అడ్డగోలుగా ఏర్పాటు చేశారు.
● జిల్లాలో ఇంటింటికీ రేషన్ తీసుకువచ్చిన 428 ఎండీయూ వాహనాలను తొలగించి, తిరిగి పాత రోజుల్లోకి తీసుకుపోయారు.